Praja Sankalpa Yatra: ప్రజా సంకల్ప యాత్రకు ఐదేళ్లు.. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు
Praja Sankalpa Yatra Completed 5 Years: వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’కు నేటితో ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగే వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఈ వేడుకలకు హాజరు కానున్నారు. ఆల్రెడీ ఈ వేడుకలకి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇదో కీలక ఘట్టం కాబట్టి.. ఈ సందర్భాన్ని ఘనంగా నిర్వహించాలని వైసీపీ నేతలు నిర్ణయించారు.
కాగా.. 2017 నవంబర్ 6వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి వైఎస్ జగన్ ఈ ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించారు. 341 రోజుల పాటు కొనసాగిన ఈ పాదయాత్ర.. 2019 జనవరి 9వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. 13 జిల్లాల్లో 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2516 గ్రామాలను కలుపుతూ.. మొత్తం 3648 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగింది. వైఎస్ జగన్కు అధికారం కట్టబెట్టడంలో ఈ పాదయాత్ర కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవడంలో సందేహం లేదు.
Also Read
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
- AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..
ఈ యాత్రలో భాగంగా వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా పేదల్ని, రైతుల్ని కలుసుకొని.. వారి కష్టాలను అడిగి తెలుసుకొని.. వాటిని తప్పకుండా పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. ఒక అన్నగా, తమ్ముడిగా, కొడుగ్గా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. ప్రజలు ఆయన్ను బలంగా నమ్మి, సీఎం బాధ్యతల్ని అప్పగించారు. అంతకుముందు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కూడా పాదయాత్ర చేసే ముఖ్యమంత్రి అయ్యారు.
తాజావార్తలు
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Players Caught Vaping: మ్యాచ్ మధ్యలో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన ప్లేయర్స్ వీళ్లే..
-
Arshdeep Singh Trolls: రీల్స్, గర్ల్ఫ్రెండ్పై కాదు.. బౌలింగ్పై దృష్టి పెట్టు సింగ్ సాబ్!
-
Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
-
Redmi Pad 2: రెడ్మి ప్యాడ్ 2 టాబ్లెట్ విడుదల.. 7600mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు.. తక్కువ ధరకే
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో