Site icon NTV Telugu

ఏపీలో కరోనా కలకలం… 16 మంది విద్యార్థులకు పాజిటివ్..!

తూర్పు గోదావరి జిల్లా లో కరోనా కేసుల కలకలం కొనసాగుతోంది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ హాస్టల్ లో 16 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. సుమారు రెండు వందల మంది వైద్య విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తే 16 మందికి పాజిటీవ్ గా నిర్ధారణ అయింది. దీంతో కరోనా సోకిన విద్యార్థులను… హస్టల్‌ లోనే… ఐసోలేషన్‌ లో ఉంచారు. ఇటీవల ఓ మెడికల్ విద్యార్థి ఢిల్లీ లో ఫంక్షన్ కు వెళ్లొచ్చిన క్రమంలో కరోనా వ్యాప్తి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ విద్యార్థి కారణంగానే… హస్టల్‌ కరోనా వ్యాప్తి చెందినట్లు.. పేర్కొన్నారు. ఇక కరోనా కేసులు విపరీతంగా నమోదు కావడం కారణంగా… హస్టల్‌ లో అందరూ అలర్ట్‌ అయ్యారు.

Exit mobile version