Bhavya Sri Case Update: కొలిక్కివచ్చిన భవ్యశ్రీ కేసు.. ఆత్మహత్యగా భావిస్తున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhavya Sri Case Update: చిత్తూరు జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థి అనుమానాస్పద మృతి ఘటన సంచలనంగా మారింది. మైనర్ బాలిక మృతి పలు అనుమానాలకు తావిస్తున్న తరుణంలో సోషల్ మీడియా వేదికగా మరిన్ని ఆరోపణలు వస్తున్నాయి. యువతి మృతి చెంది వారం రోజులు గడుస్తున్నా ఈ కేసును పోలీసులు ఛేందించినట్లు తెలుస్తుంది. భవ్యశ్రీ మృతి కేసుపే విచారణ చేపట్టిన పోలీసులు ఆత్మహత్యగా భావిస్తున్నారు. తల్లితండ్రులు మందలించడంతోనే మనస్తాపం చెంది భవ్యశ్రీ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భవ్యశ్రీ కేసులో పోలీసుల దర్యాప్తు తుదిదశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తరువాత భవ్యశ్రీ మృతిపై పోలీసులు చివరిగా ఓ క్లారటీకి రానున్నట్లు సమాచారం.
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం వేణుగోపాలపురానికి చెందిన మునికృష్ణ, పద్మల చివరి కుమార్తె భవ్యశ్రీ(16) పెనుమూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 16న గ్రామంలో వినాయక చవితికి ఏర్పాట్లు జరుగుతుండగా పూలు కోసేందుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చిన భవ్యశ్రీ కనిపించకుండా పోయింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు గ్రామస్తుల సాయంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా భవ్యశ్రీ కనిపించలేదు. దీంతో ఈ నెల 17వ తేదీ సాయంత్రం పెనుమూరు పోలీసులకు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. ఈ నెల 19వ తేదీ సాయంత్రం భవ్యశ్రీ ఇంటి సమీపంలోని పాడుబడిన బావిలో మృతదేహం తేలుతూ కనిపించింది. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Also Read
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతి మృతదేహాన్ని బావిలోంచి వెలికితీసి మృతదేహం భవ్యశ్రీగా గుర్తించారు. మృతదేహం నుంచి నమూనాలు సేకరించి ఆర్ఎఫ్ఎఫ్ఎస్ ల్యాబ్కు తరలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బావిలో భవ్యశ్రీ తల గుండు కొట్టినట్టుగా కనిపించడం, భవ్యశ్రీ వేసుకున్న కాళ్లకు లెగ్ హీల్స్ లేకపోవడం, కనురెప్పలు తెగిపోవడం, నాలుక కరుచుకోవడంపై భవ్యశ్రీ తల్లిదండ్రులు, స్థానికుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ కేసులో అనుమానాస్పదంగా ఉన్న నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సాంకేతిక విశ్లేషణ ద్వారా కేసును ఛేదించే ప్రయత్నం చేస్తుండగా.. భవ్యశ్రీది ఆత్మహత్యగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది రోజుల తరువాత చివరకు పోలీసులు భవ్యశ్రీ ది ఆత్మహత్యగా అనుమానం వ్యక్తం చేడయం సంచలనంగా మారింది.
Hyderabad: వాహనదారులు అలర్ట్.. ఈ ఏరియాల్లో బీభత్సమైన ట్రాఫిక్..
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!