NTV Telugu Site icon

PM Modi: జూలై 4న ఏపీలో ప్రధాని మోదీ టూర్ షెడ్యూల్

Pm Modi

Pm Modi

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ వచ్చేనెలలో ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు జూలై 4న ప్రధాని మోదీ భీమవరంలో పర్యటించి అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. జూలై 4న విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి భీమవరం వెళ్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. తొలుత రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి భీమవరం వెళ్తారని భావించినా సెక్యూరిటీ కారణాల వల్ల ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు.

ప్రధాని మోదీ షెడ్యూల్ ఇలా సాగుతుంది
జూలై 4న ఉదయం 9:20 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరనున్న ప్రధాని మోదీ ఉదయం 10:10 గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఉదయం 10:50 గంటలకు భీమవరం వెళ్లనున్నారు. భీమవరంలోని స్థానిక ఏఎస్‌ఆర్ నగర్‌లో ఉన్న పురపాలక పార్కు ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం భీమవరం నుంచి విజయవాడకు వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1:10 గంటలకు ఢిల్లీ బయలుదేరతారని అధికారులు వివరించారు.

Andhra Pradesh: నేటి నుంచి అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు