Perni Nani : తప్పుడు రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట
- తప్పుడు రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట
- ప్రజాస్వామ్యాన్ని తప్పుడు దారిలో నడిపించడంలో చంద్రబాబు వింతపోకడలు పోతున్నారు
- ఓ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణం చేయించారు
- వ్యక్తులను ప్రలోభాలకు గురిచేయటంలో ఆయనకు ఆయనే సాటి
- చంద్రబాబు రాజకీయ అనైతిక క్రీడలో భాగమే మా పార్టీ ఎమ్మెల్సీల రాజీనామాలు. -పేర్ని నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani : కూటమి ప్రభుత్వంపై మరోసారి వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తప్పుడు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు గతంలో ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణం చేయించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన అన్నారు. మనుషులను ప్రలోభాలకు గురి చేయడంలో చంద్రబాబుకు సరితూగే వ్యక్తి లేరని విమర్శించారు. కొనుగోలుదారులను సిద్ధం చేసి, బయానాలు ఇప్పించి, నేతలను రాజీనామా చేయించేందుకు ఒత్తిడి తెస్తారని ఆరోపించారు.
రాజీనామా చేసిన వారిని ఆమోదించమని సంబంధిత పార్టీలు అడగాలి, కానీ ఇక్కడ పరిస్థితి రివర్స్గా ఉందని అన్నారు. మా పార్టీ ఎమ్మెల్సీల రాజీనామాలు కూడా చంద్రబాబు రాజకీయ అనైతిక క్రీడలో భాగమేనని పేర్ని నాని ఆరోపించారు. చంద్రబాబు చట్టాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో ఆరోగ్య కారణాలతో బెయిల్పై వచ్చారని, కానీ వెంటనే 18 గంటల ర్యాలీ నిర్వహించి, అప్పటి నుంచి ఆస్పత్రికి కూడా వెళ్లలేదని అన్నారు.
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
ఈ అవకాశాన్ని ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ఉపయోగించకుండా, వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టేందుకే ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. అమరావతి అంశంపై కూడా ఆయన చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అమరావతి విషయంలో రైతులను నట్టేట ముంచే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. గతంలో జగన్ శాసన రాజధాని ఇదేనని స్పష్టంగా చెప్పారు, కాని చంద్రబాబు మాత్రం అమరావతి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఈ శీతాకాలంలో టూర్ ఎక్కడికి వెళ్లాలి? ఇండియాలోని బెస్ట్ వింటర్ స్పాట్స్ ఇవే !
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!