Pawan kalyan: ప్రధాని కాళ్లపై పడ్డ పవన్.. మోడీ షాకింగ్ రియాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan kalyan Modi Bonding: ఏపీలో ఎన్నికల డేట్ దగ్గర పడుతున్న తరుణంలో గెలుపే లక్ష్యంగా ఒకపక్క వైసీపీ నేతలు, మరోపక్క కూటమి నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచార జోరును పెంచగా కూటమి తరపున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆంధ్ర వచ్చారు. రాజమండ్రిలో టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వేదికపై వచ్చిన ప్రధానికి ముందుగా బీజేపీ ముఖ్యనేతలు, టీడీపీ నేత నారా లోకేష్ శాలువా కప్పి స్వాగతం పలకగా ఆ తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రధానికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేదికపై వచ్చిన ప్రధానికి జనసేనాని శాలువా కప్పి స్వాగతం పలికి మోదీ కాళ్లకు పవన్ నమస్కరించబోగా అందుకు ఆయన వద్దని నిరాకరించారు. కాళ్లకు నమస్కారం పెట్టవద్దని జనసేనానికి చెబుతూ మోదీ కూడా కిందకు వంగారు.
Throw Back: కడుపుతో ఉన్న నటిని 51 సార్లు కత్తితో పొడిచి, 16 ముక్కలుగా నరికి చంపారు!
Also Read
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
ఆ అనంతరం పవన్ను ప్రధాని మోదీ ఆలింగనం చేసుకున్నారు. ఇక ఈ సీన్ చూసిన ఇరు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఇక అనంతరం ప్రధాని మోడీ మీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. రాజమండ్రి వేమగిరిలో కూటమి తరపున నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అయోధ్యకు రాముడిని తీసుకొచ్చిన మహానుభావుడు మోడీ అని పేర్కొన్నారు. ప్రపంచానికి భారత్ శక్తి ఏంటో చూపించారని కొనియాడారు. దేశాభివృద్ధితో పాటు గుండె ధైర్యం కూడా అవసరమేనని, శత్రువుల నుంచి దేశాన్ని కాపాడాలంటే గుండె ధైర్యం కావాలన్నారు. భారత్ వైపు చూడాలంటే పదేళ్లుగా శత్రువులు భయపడిపోతున్నారని ఎందుకంటే మోడీ ఒక్క పిలుపుతో దేశంలోని ప్రతి అణువు కదిలి వస్తోందన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులు, పథకాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అకౌంట్లో వేసుకుంటోందని విమర్శించారు, కొన్ని పథకాలను సీఎం జగన్ సరిగా వినియోగించుకోలేక పోయారని పవన్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
-
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
-
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!