Online Frauds: ఆన్ లైన్ కేటుగాళ్ళు.. ఆదమరిస్తే అంతే సంగతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అవకాశం వచ్చిందంటే చాలు తమ మాయాజాలం ప్రజలపై ప్రదర్శిస్తూ అకౌంట్లో డబ్బులు కొట్టేస్తున్నారు. ఒకప్పుడు ఏటీఎం సెంటర్లలో జనం రద్దీగా ఉండే సెంటర్లలో మాత్రమే జరిగే అకౌంట్ చోరీలు ఇప్పుడు నెట్ ఫోన్ల పుణ్యమా అని నేరుగా మన వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చి అకౌంట్లో సొమ్ము ఖాళీ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు….. గుంటూరు జిల్లాలో తాజాగా జరుగుతున్న అనేక ఘటనలు నష్టాల పాలు చేస్తున్నాయి.
మీ ఆయనకు ఆరోగ్యం బాగా లేదు కదా మీకు సీఎం ఆఫీస్ నుండి లక్ష రూపాయలు శాంక్షన్ అయ్యాయి మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అందులో మినిమం ఓ పది వేలు ఉంచండి ఆతరువాత లక్ష రూపాయలు మీవే అంటూ మాయగాళ్ళు విసిరిన వలకు అకౌంట్లో సొమ్ము ఖాళీ చేసుకుంది ఓ మహిళ …గుంటూరు జిల్లా బొర్రా వారి పాలెం నుండి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు…
Also Read
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
మనిషి వ్యక్తిగత సమాచారం, అవసరాలు తెలుసుకుని, మీకు ఆరోగ్యశ్రీ అమౌంట్ వచ్చింది, ఈ రోజు తో ఆఖరు ..మీ అకౌంట్ నంబర్ చెప్తే అమౌంట్ వేస్తాం లేదంటే మీ ఇష్టం అంటూ ఒక మహిళ ను నమ్మిచడం ఆతరువాత ఆమె ద్వారా మరో మహిళ అకౌంట్ లో ఆమె అన్న అకౌంట్ లో డబ్బును క్షణాల్లో కొట్టేసిన వ్యవహారం కొత్త మళ్ళాయి పాలెం లో జరిగింది. ఇవే కాదు మీరు మా దగ్గర అప్పు తీసుకున్నారు ఆ అప్పు చెల్లించకపోతే మీపై తప్పుడు ప్రచారం చేస్తాం అసభ్య ఫోటోలు పెట్టి మీ పరువు తీసేస్తా అంటూ మెసేజ్.
మీరు ఇంట్లోనే ఉండి రోజుకి వేలకు వేలు సంపాదించవచ్చు వర్క్ ఫo హోం ద్వారా రోజుకు ఐదు వేల ఆదాయం అంటూ మెసేజ్ లు. మీరు మొబైల్ ఫోన్ లో యూట్యూబ్ లింకులు ఓపెన్ చేస్తే నెలకు 40వేల జీతం అంటూ నమ్మబలికి తీయటి మాటలు చెప్పి అమాయకుల వద్ద లక్షల్లో కాజేస్తున్నారు కేటుగాళ్లు. మరోవైపు బ్యాంకు ఓటీపీల పేరుతో జరుగుతున్న ఆన్లైన్ నిలువు దోపిడీ తో ప్రజలు ఫోన్ పట్టుకోవాలంటేనే వణికిపోయే పరిస్థితి. ఇతర రాష్ట్రాల నుండి చక్కటి తెలుగు భాషలో మాట్లాడి అమాయకులను బుట్టలో పడేస్తున్నారు సైబర్ దొంగలు. షాపింగ్ మాల్స్ ఇతర బహిరంగ ప్రదేశాల్లో మీ వ్యక్తిగత సమాచారం ఇతరులతో షేర్ చేయొద్దు అంటున్నారు పోలీసులు. అనుమానితులు అపరిచిత వ్యక్తులు ఫోన్ నెంబరు ఇవ్వవద్దంటున్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!