Site icon NTV Telugu

శ్రీశైలం : ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి

తెలుగు రాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు క్రమంగా పెరుగుతుంది. దాంతో శ్రీశైలంలో మళ్ళీ జలవిద్యుత్ ప్రారంభించారు. అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 50,317 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో 34,836 గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 873.90 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 158.6276 టీఎంసీలు ఉంది. అయితే ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం నుండి మళ్ళీ విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా… కుడి గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

Exit mobile version