October 15: ఏపీలో వేడిని రాజేస్తున్న అక్టోబర్ 15… ఏం జరగనుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మూడురాజధానుల రచ్చ కొనసాగుతూనే వుంది. అమరావతి ముద్దు-మూడురాజధానులు వద్దని విపక్షాలు గొంతెత్తి నినదిస్తున్నాయి. ఇటు అధికార పార్టీ మాత్రం మూడురాజధానుల విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా మంత్రులు, ఎమ్మెల్యేలు డైలాగ్ లు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ వేడిని పుట్టిస్తుంది అక్టోబర్-15. వైసీపీ, టీడీపీ,జనసేన ఫోకస్ అంతా విశాఖ పైనే వుంది. అక్కడ జరుగుతున్న పరిణామాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. వికేంద్రీకరణ కోసం విశాఖ గర్జన నిర్వహిస్తున్న నాన్ పొలిటికల్ జె.ఏ.సీ పైనే అందరి ఫోకస్ పడింది.
Read Also: Aqua Ex India 2022: ఫిషరీస్ యూనివర్శిటీకి 28న జగన్ శంకుస్థాపన
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
విశాఖ గర్జనకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది అధికార వైసీపీ. 50వేల మందితో భారీ ర్యాలీకి సన్నాహాలు చేస్తోంది. ఎల్.ఐ.సీ సర్కిల్ నుంచి బీచ్ రోడ్ వరకు సుమారు 4.5.కిలోమీటర్ల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ప్రభుత్వం వైఫల్యాలపై విస్త్రత సమావేశంకు సిద్ధమైంది విపక్ష టీడీపీ. తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకత్వం విశాఖ తీరానికి రానుంది. ఈనెల 15 నుంచి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన కూడా వుంది. జనవాణి , పార్టీ సమీక్ష కోసం విశాఖకు వస్తున్నారు పవన్ కళ్యాణ్. పవన్ పై మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలతో ఇప్పటికే హాట్ హాట్ గా మారింది విశాఖ రాజకీయం. మంత్రికి వ్యతిరేకంగా పోస్టర్లు వేసింది జనసేన. ఇటు అధికార పార్టీ నేతలు కూడా విశాఖ రాజధాని విషయంలో రాజీలేదంటున్నారు. విపక్షాలు, అమరావతి పాదయాత్రపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు విరుచుకుపడుతున్నారు.
Read Also: PM Narendra Modi: నాలుగో వందేభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ
గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రి అమర్ నాథ్ పవన్ పై విరుచుకుపడ్డారు. దత్త తండ్రి @ncbn తరఫున.. దత్త పుత్రుడి @PawanKalyan మియావ్ మియావ్…!మియావ్.. మియావ్ దత్తపుత్రుడి @PawanKalyan త్రీ క్యాపిటల్స్:1-అంతర్జాతీయ రాజధాని మాస్కో, 2-జాతీయ రాజధాని ముంబాయి, 3-పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అంటూ వ్యంగ్యంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జనసేన నేతలు మంత్రిని టార్గెట్ చేశారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!