New Crime: వెలుగులోకి కొత్త తరహా మోసం.. మీకు తెలియకుండానే బ్యాంకులో అప్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీకు భూములు ఉన్నాయా? భూముల పేరుతో బ్యాంకులో అప్పు తీసుకున్నారా? ఒకవేళ తీసుకోకపోతే.. మీ భూమి ఎవరి పేరుతో ఉంది..? బ్యాంకులో అప్పులు ఉన్నాయా అర్జెంటుగా ఒక్కసారి చెక్ చూసుకోండి. ఇదంతా ఎందుకంటారా..? ఎందుకంటే మీకు తెలియకుండానే కొందరు మోసగాళ్లు మీ పేరున లీజు అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదో కొత్త తరహా మోసం. లీజు అగ్రిమెంట్ ఆధారంగా బ్యాంకు నుంచి అప్పులు దర్జాగా పొందుతున్నారు. ఇప్పుడు తూ.గో. జిల్లాలోని కడియం ప్రాంతంలో ఈ తరహా మోసం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. నాలుగేళ్ళ కిందట చనిపోయిన వ్యక్తి తమకు భూమి లీజుకిచ్చారంటూ లీజు అగ్రిమెంట్ పత్రాన్ని సృష్టించి ఆ పత్రాలతో బ్యాంకు లోనుకు కొందరు ప్రబుద్ధులు ప్రయత్నించారు. తీరా బ్యాంకు అధికారులు భూ యజమాని కోసం వచ్చి లీజు అగ్రిమెంట్ రుణంపై ఆరా తీయడంతో నాలుగేళ్ళ కిందటే చనిపోయాడని తెలిసి అవాక్కయ్యారు. విలువైన భూములు కలిగిన కడియం నర్సరీల్లో కొందరు దస్తావేజు లేఖర్ల మాయాజాలంతో రైతులు గుండెలు బాధుకుంటున్నారు.
Also Read
- Pawan Kalyan : ఏపీలో రక్షణ రంగ విప్లవం.. మెగా ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం.!
- Illegal Ration Rice: అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం.. 2 వేల కేజీల బియ్యం స్వాధీనం!
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
తూ.గో. జిల్లా కడియం మండలం పొట్టిలంకకు చెందిన గట్టి నారాయణరావుకు వీరవరం రెవెన్యూ పరిధిలో మూడున్నర ఎకరాల భూమి ఉంది. భూమిపై ఎలాంటి అప్పులు లేవు. అయితే రంగంపేట మండలం వడిశలేరుకు చెందిన ఉప్పలపాటి బసవన్న చౌదరికి ఈ భూమిని 12 సంవత్సరాలకు లీజు అగ్రిమెంట్ చేసినట్లు డాక్యుమెంట్లు పెట్టి కాకినాడ బ్యాంకు ఆఫ్ ఇండియాలో రుణం పొందేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో అసలు రైతును కలిసి వివరాలు సేకరించమని కడియం మండలం బుర్రిలంక బ్రాంచ్ కు డాక్యుమెంట్లు పంపారు.
వీరు పొట్టిలంక రైతు ఇంటికెళ్లి లీజుపై ఆరా తీసారు. నారాయణరావు కుమారుడు మణికంఠ ఎవరికీ లీజుకి ఇవ్వలేదని బ్యాంకు అధికారులకు చెప్పారు. మీరు కాదు భూమి యజమాని ఈ విషయం చెప్పాలని కాస్త గట్టిగానే అడిగారు. తన తండ్రి నాలుగేళ్ల క్రితం మృతి చెందితే గత నెలలో రిజిస్ట్రేషను ఆఫీసుకు వచ్చి ఎలా లీజు అగ్రిమెంట్ చేసారని మణికంఠ ఇంకా గట్టిగా చెప్పడంతో బ్యాంకు అధికారులకు మతిపోయింది. ఇదే విషయాన్ని కాకినాడ బ్యాంకుకు నివేదించారు.
అయితే మరణించిన రైతు పేరున లీజు అగ్రిమెంట్, బ్యాంకు అప్పులు అనేసరికి బెంబేలెత్తిపోయిన మణికంఠ కడియం పోలీసులను ఆశ్రయించాడు.
బాధితుడు మణికంఠ ఫిర్యాదుపై కడియం సీఐ రాంబాబు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు . అయితే లీజు అగ్రిమెంట్లో సాక్షులుగా పొట్టిలంక గ్రామానికే చెందిన ఈలి శ్రీను, గట్టి చంద్ర శేఖర్ పేర్లు ఉన్నాయి. పోలీసులు వీరి గురించి ఆరా తీయగా ప్రస్తుతం అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. అయితే అసలు ఈ లీజు అగ్రిమెంట్ కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిందా వేరే ఎక్కడైనా జరిగిందా అనేది తేలాల్సి ఉంది. కొందరు దస్తావేజు లేఖర్లు డబ్బులు కోసం ఇటువంటి అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకులలో ఎలాంటి అప్పులు తీసుకోని వారిని గుర్తించి ఇలా లీజు అగ్రిమెంట్ పేరుతో దొడ్డి దారిన అప్పులు పొందుతున్నారు. లీజు అగ్రిమెంట్ అడ్డం పెట్టుకుని పలు వ్యాపారాలు పేరుతో అప్పులు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పూర్తి రిజిస్ట్రేషన్ అయితే పాస్ బుక్ లు, ఆన్ లైన్లో పేరు మార్పులు జరిగితేనే బ్యాంకు అప్పు ఇస్తుంది. ఇలా లీజు అగ్రిమెంట్ పేరుతో సులభంగా బ్యాంకు నుంచి అప్పులు పొందే కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ఇందుకే రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలను ఇసీ ద్వారా తెలుసుకోవడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
-
Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
-
Pawan Kalyan : ఏపీలో రక్షణ రంగ విప్లవం.. మెగా ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం.!
-
Husband Suicide: ‘‘నా చేయి పట్టుకున్న భార్యే నన్ను చంపింది’’.. సూసైడ్ వీడియోలో భర్త ఆవేదన
-
Dollar vs Rupee: రక్తకన్నీరు పెట్టుకుంటున్న రూపాయి.. తొలిసారిగా రూ.96 మార్క్ను దాటిన డాలర్ విలువ!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!