విశాఖలో గంజాయి స్మగ్లర్ల కొత్త మార్గాలు : అమెజాన్లో తరలింపు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా..విశాఖ ఏజెన్సీలో గంజాయి అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. ఓ వైపు అధికారులు దాడులతో వేల కిలోల స్వాధీనం చేసుకుంటున్నారు. మరో వైపు స్మగ్లర్లు గంజాయి చేరవేతకు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకునేందుకు కరివేపాకు పొడి, హెర్బల్ పౌడర్ల పేరుతో అమెజాన్ పికప్ బాయ్స్ సహకారంతో విశాఖ కేంద్రంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ద్వారా ఆన్లైన్లో గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నట్టు మధ్యప్రదేశ్ పోలీసులు గుర్తించారు.
మనమంతా అమెజాన్, ప్లిప్ కార్ట్, ఏజీయో, మింత్రా వంటి ఈ మార్కెట్ వెబ్ సైట్స్ కోసం వినే వుంటాం. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతీ ఒక్కరికి ఇప్పుడు ఆన్ లైన్ లో షాపింగ్ చేయాలంటే ఇటువంటే యాప్స్ ఏ దిక్కు. నచ్చిన వస్తువును క్షణాల్లో బుక్ చేసి రోజుల వ్యవధిలోనే పొందే సదుపాయం కల్పించాయి ఈ మార్కెట్ వెబ్… కానీ తాజాగా చోటుచేసుకున్న ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయ్. ఆన్ లైన్ లో షాపింగ్ కి ఉపయోగించే వీటిని కూడా గంజాయి స్మగ్లర్లు విడిచిపెట్టలేదు. అమెజాన్ వేదికగా గుట్టుచప్పుడు కాకుండా విశాఖ నుండి గంజాయిని తరలిస్తున్నారు.
Also Read
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
ఏ మాత్రం అనుమానం రాకుండా కోట్ల రూపాయలు విలువ చేసే గంజాయిని అక్రమంగా సరఫరా చేసి క్యాష్ చేసుకుంటున్నారు… గంజాయి సప్లయ్ చేసే ముఠాలు ఎప్పటికప్పుడు రూట్లు మారుస్తున్నారు. ఎందుకంటే పోలీసుల నిఘా ఉండటంతో కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలో గంజాయి సరఫరా పై భారీగా విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వాన్ని విపక్షాలు పదే పదే విమర్శిస్తున్నారు. ఇక గంజాయి సరఫరా ఏ రాష్ట్రంలో బయట పడ్డా..ఆ లింకులు ఆంధ్రప్రదేశ్ తో ఉంటున్నాయి. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ నుంచి భారీగా అక్రమంగా గంజాయి రవాణా అవుతోందని తేలుతుంది. ఇప్పటికే విశాఖకు ఇదో మాయని మచ్చలా తయారైంది.. దీంతో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంజాయి సరఫరాను నియంత్రించేందుకు ఫోకస్ చేసింది. విశాఖ వచ్చిన రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్.. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షించి గంజాయి సాగు ధ్వంసం చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
తాజావార్తలు
-
Anil Ravipudi: దళపతి విజయ్ నుంచి అనిల్ రావిపూడికి స్పెషల్ కాల్.. ఆ సినిమానే కారణం!
-
ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల.. టాప్లోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ..
-
IMD Alert: బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వాయుగుండాలు.. దేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం
-
Uttar Pradesh: నా భార్య, ఆమె ప్రియుడు నన్ను చంపేస్తారు.. ప్రేమ పెళ్లి, ఇప్పుడు ప్రాణభయం..
-
Meher Ramesh: మొన్ననే కూతురి పెళ్లి.. ఇప్పుడు తీవ్ర విషాదంలో డైరెక్టర్ మెహర్ రమేష్ ఫ్యామిలీ!
ట్రెండింగ్
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!