Nara Lokesh: ఇంకెన్నాళ్లు మీ అరాచకాలు జగన్ రెడ్డి గారూ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఈ సందర్భంగా తమకు ఓటు వేయని ఓ ఇంటిని వైసీపీ నేత కబ్జా చేసిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన ప్రస్తావించారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం గానుగ పెంటలో మేకల కాపరి మర్రి శ్రీను ఇంటిని వైసీపీ నేతలు కబ్జా చేశారని లోకేష్ ఆరోపించారు. తమకు ఓటేయకపోతే వేటు వేయడం వైసీపీ నయా ఫ్యాక్షన్ డెమోక్రసీ అని నారా లోకేష్ చురకలు అంటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థుల ఏకగ్రీవానికి ఒప్పుకోకుంటే చేసిన అరాచకాలు చూశామని.. స్థానిక ఎన్నికల్లో వైసీపీ దాడులు, ఆస్తుల ధ్వంసం, బెదిరింపులు, కిడ్నాప్లు, హత్యలు చేయడం చూశామని.. ఎన్నికలై చాలా రోజులైనా టీడీపీకి ఓట్లేశారంటూ మద్దతు పలికారనే కక్షతో ఇప్పటికీ వైసీపీ నేతలు నానా ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నారని మండిపడ్డారు.
Read Also: Janasena Party: రోడ్ల దుస్థితిపై జనసేన డిజిటల్ క్యాంపెయిన్.. తేదీలు షురూ
Also Read
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేసి తన ఓటమి కారణం అయ్యాడనే కక్షతో మర్రి శ్రీను ఇంటినే కబ్జా చేశారని లోకేష్ విమర్శలు చేశారు. అధికారం అండ చూసుకుని ఏకంగా ఇల్లు ఆక్రమించేయడంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెన్నాళ్లు మీ అరాచకాలు జగన్ రెడ్డి గారూ.. ప్రజలు తిరగబడకముందే ఇటువంటి కబ్జాలు, అరాచకాలు మానాలంటూ నారా లోకేష్ హితవు పలికారు.
ఓటు వేయకపోతే వేటు వేయడం వైసీపీ నయా ఫ్యాక్షన్ డెమోక్రసీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థుల ఏకగ్రీవానికి ఒప్పుకోకపోతే వైసీపీ దాడులు, ఆస్తుల ధ్వంసం, బెదిరింపులు, కిడ్నాప్లు, హత్యలు చేయడం చూశాం.(1/4) pic.twitter.com/KWGHq2xfs5
— Lokesh Nara (@naralokesh) July 12, 2022
తాజావార్తలు
-
Spirit : స్పిరిట్.. ఇది కదా కావాల్సింది!
-
Virat Kohli Chase Master: విరాట్ కోహ్లీ కొడితే అర్సిబీ గెలవాల్సిందే.. షాకింగ్ గణాంకాలు ఇవే!
-
PEDDI POWERPLAY TOUR : ‘పెద్ది’ ప్రమోషనల్ టూర్ ప్లాన్ వచ్చేసింది
-
VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
-
Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!