కేసీఆర్, జగన్కు ముద్రగడ లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాశారు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం… ఇప్పటికే పలు అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ నుంచి సీఎం వైఎస్ జగన్ వరకు లేఖలు రాస్తున్న ముద్రగడ.. ఈ సారి రైతుల సమస్యలను పేర్కొంటు ఏపీ, తెలంగాణ సీఎంలకు లేఖలు రాశారు.. ఇటీవల వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతు వెన్నెముక విరిగిపోచిందని.. తడిచిన ధాన్యం ప్రభుత్వాలు కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. తడిచిన ధాన్యం నుంచి ఆల్కహాల్ స్పిరిట్ తయారు చేసేందుకు ఆస్కారం ఉంటుందని లేఖలో పేర్కొన్న ఆయన.. జిల్లాకు ఒకటి చొప్పున ధాన్యం నుంచి ఆల్కహాల్ స్పిరిట్ తీసే డిస్టిలరీ ఏర్పాటు కావాలని.. తద్వారా ధాన్యం తడిచినా రైతులకు మద్దతు ధర వస్తుందన్నారు.
Read Also: కాలేజీల్లో కూడా హెచ్ఐవీ టెస్ట్లు..! సీఎం ఆదేశాలు
Also Read
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
- Steel Plant Accident : ఇవాళ విశాఖకు వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇలా..!
ఇక, నేను మంత్రిగా పని చేసిన సమయంలో ఈ ప్రతిపాదనలు వచ్చాయని ఈ బహిరంగ లేఖలో పేర్కొన్నారు ముద్రగడ పద్మనాభం… ఇరువురు ముఖ్యమంత్రులు ధాన్యం నుంచి స్పిరిట్ తయారు చేసే డిస్టిలరీలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటే రైతులకు నష్టాలు రావన్న ఆయన… వరి వద్దనీ వాణిజ్య పంటలు వేయమని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు.. నీరు అధికంగా ఉండే భూముల్లో వరి తప్ప వాణిజ్య పంటలకు అస్కారం ఉండదని సీఎంల దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. ఈ వైపుగా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వరి కొనుగోళ్ల విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.. దీంతో.. వివిధ మార్కెట్లలో రైతులు ధాన్యం బస్తాలతో ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది.. ఇక, కొన్ని చోట్ల కల్లాలు, రోడ్లపై కూడా వరి ధాన్యం దర్శనమిస్తోంది.. చాలా ప్రాంతాల్లో వర్షాలతో వది ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి