Site icon NTV Telugu

MLC Ashok : ఏపీలో స్విచ్ వేయక ముందే షాక్ కొట్టే పిరిస్థితి

TDP MLC Ashok Made Comments on CM Jagan.

చీప్ లిక్కరును కాస్ట్ లీ ధరలకు అమ్ముతూ ప్రజలను దోచుకుంటున్న సీఎం జగన్ తాజాగా కాస్ట్ లీ కరెంట్ పథకం అమలుకు సిద్ధమయ్యారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం మార్చిన విద్యుత్ శ్లాబులతో 75యూనిట్ల కేటగిరిలో ఉన్నవారు నిన్నటివరకు రూ.169 కడితే, రేపట్నుంచి రూ.304 కట్టాలని, నెలనెలా కేటగిరీలు మారుస్తూ.. 13 శ్లాబుల్ని 6 శ్లాబులుగా కుదించిన జగన్ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం మోపారన్నారు. తక్కువ విద్యుత్ వినియోగించేవారి పైఎక్కువభారం.. ఎక్కువ విద్యుత్ వాడేవారిపై తక్కువ భారం మోపిన సీఎం చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యుత్ స్విచ్ వేయక ముందే షాక్ కొట్టే పిరిస్థితి కల్పించారని, ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన పాపానికి ప్రజలంతా ఫ్యాన్ స్విచ్ వేయాలంటేనే వణికిపోతున్నారని ఆయన విమర్శించారు.

బొగ్గుఉత్పత్తి కేంద్రాలకు బకాయిలు పడటం.. సోలార్ విద్యుత్ ఒప్పందాలు రద్దుచేయడం వంటి జగన్ రెడ్డి నిర్ణయాలు విద్యుత్ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని, విద్యుత్ రంగాన్ని సర్వనాశనంచేసి, తాను చేసిన అప్పులకు ప్రజలను బలి తీసుకుంటున్న జగన్ రెడ్డిని ప్రజల్లో దోషిగా నిలబెట్టే తీరుతామన్నారు. విద్యుత్ రంగం రోజు రోజుకీ బలపడుతూ, విద్యుత్ వినియోగం అధికమవుతున్న తరుణంలో జగన్ ప్రభుత్వం దాన్నికూడా అవినీతి మయం చేసిందని ఆయన ఆరోపించారు. టీడీపీ హాయాంలో విద్యుత్ రంగంపై, ఛార్జీలు పెరిగాయని చేసిన దుష్ప్రచారంపై జగన్ సమాధానం చెప్పాల్సిందేనని, ప్రతిపక్షంలోఉన్నప్పుడు విద్యుత్ రంగంపై చేసిన ఆరోపణలకు జగన్ క్షమాపణ చెప్పి.. తాను చేసిన తప్పుడు ఆరోపణలను వెనక్కు తీసుకోవాలన్నారు.

https://ntvtelugu.com/balka-suman-made-sensational-comments-on-revanth-reddy/
Exit mobile version