Anam Ramnarayana Reddy: ఎమ్మెల్యే ఆనంపై వేటు… నేదురుమల్లికి చోటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి వైసీపీ అధిష్టానం షాకిచ్చింది. ఆయనను పార్టీ బాధ్యతలనుంచి తప్పించింది. వెంకటగిరి ఇన్ ఛార్జిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నియామకం చేయబోతోంది.. ఆనంపై అధిష్టానం వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళో, రేపో వైసీపీ దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేయనుంది. బాలాయపల్లి మండల కేంద్రంలో… వైఎస్సార్ పింఛను కానుకను ప్రారంభించిన ఎం.ఎల్.ఏ. ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. సచివాలయం, వాలంటీర్లకు సచివాలయ భవనాలు లేవు. వాళ్ళు ఎక్కడ కూర్చొని పనిచేయలో తెలియడంలేదు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన చేసిన విమర్శలు అధిష్టానానికి ఆగ్రహం తెప్పించాయి.
Read Also: Rashtrapati Bhavan : సామాన్యులకు సదవకాశం.. జనవరి 15 వరకు రాష్ట్రపతి భవన్ సందర్శన
Also Read
- Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాదు.. అది క్రిమినల్స్ అదృష్టం.. లా అండ్ ఆర్డర్పై పవన్ ఘాటు వ్యాఖ్యలు..
- APL 2026: మంగళగిరిలో ఏపీఎల్ జోష్.. సెమీస్, ఫైనల్కు భారీ ఏర్పాట్లు
- Sajjala Ramakrishna Reddy: గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం.. వైసీపీ కొత్త వ్యూహం
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
అద్దె భవనాల్లో, పాడుబడ్డ స్కూళ్ల లోనో. అంగన్వాడీల్లోనో కార్యాలయాలు పెట్టుకుంటున్నారు. నిధులు మంజూరు చేసినా మండలంలో భవనాలు పూర్తి కావడం లేదు. సచివాలయ ఉద్యోగులు ఏమి పనిచేయడం లేదంటే, ఇక్కడ కూర్చోవడానికి స్థలం లేదంటున్నారు.వర్షం పడితే బిల్డింగులు కురుస్తున్నాయి,కంప్యూటర్లు..ఫైళ్లు తడిచిపోతున్నాయని విమర్శలు వస్తున్నాయి.భవనాలు ఉంటేనే సచివాలయ ఉద్యోగులు ప్రజలకు సేవలు అందించగలగుతారు. మౌలిక వసతులు లేనిదే ఏ ప్రభుత్వ అధికారి పనిచేయలేరు. సచివాలయ ఉద్యోగులు ఉన్నత చదువులు చదివి దిక్కులేక రావడం లేదు.
వాళ్ళు చదివిన చదువులకు, డిగ్రీలకు ప్రభుత్వాల్లో, ప్రయివేటు రంగంలో ఎక్కువ జీతాలు వస్తాయి. ప్రజాసేవకోసమే వాళ్ళు సచివాలయ ఉద్యోగాలకు వచ్చారు. అధికారులు ఇకనైనా భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేసి, పూర్తిచేయాలన్నారు. ఇదిలా ఉంటే.. మరో మారు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ముందస్తు ఎన్నికలు అంటున్నారు.. అవిగాని వస్తే సంవత్సరంలోపే ఇంటికి వెళ్ళడం ఖాయం.. ప్రజలు మాకు అధికారం ఇచ్చి ఐదు ఏళ్ళు పూర్తి కావస్తోంది..కానీ ఇంకా సచివాలయ నిర్మాణాలు పూర్తి కాలేదు.
Read Also: Chinese Manja : బైకర్ ప్రాణం తీసిన పతంగి మాంజా
సాంకేతిక కారణాలా లేక.. చెల్లింపులు ఆలస్యమ వుతుందని కట్టడానికి ముందుకు ఎవరు రావడం లేదా.. తెలియడం లేదు..ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు, నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. రోడ్లు పరిస్థితి చాలా దారుణంగా ఉంది..నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో రోడ్లు వేస్తున్నాం..కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వాగుల వద్ద హై లెవెల్ బ్రిడ్జిలు కట్టబోతున్నాం.. త్వరలో టెండర్లు కూడా పిలుస్తాం అన్నారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. నియోజకవర్గ బాధ్యతల్ని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి అప్పగిస్తారనే వార్తల నేపథ్యంలో ఆయన అనుచరులు సందడి చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: పుత్తడి అమ్మకాలు ఎందుకు తగ్గాయి..? ఆర్థిక పరిస్థితులే కారణమా..?
-
Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
-
Off The Record: శృంగవరపు కోట TDPలో గ్రూప్ వార్!
-
UP: అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!.. అఖిలేష్ యాదవ్కు భారీ ఝలక్ తప్పదా?
-
kitchen tips: చపాతీ కర్రకు బూజు పడుతోందా? ఈ చిన్న ట్రిక్తో ఫంగస్కు చెక్ పెట్టండి!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!