NTV Telugu Site icon

Crime News: ఏపీలో మరో దారుణం.. బాలికపై 10 మంది గ్యాంగ్ రేప్

Gang Rape

Gang Rape

ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. తాజాగా కడప జిల్లాలో ఓ బాలికపై 10 మంది గ్యాంగ్ రేప్ చేసిన ఘటన వెలుగు చూసింది. ప్రొద్దుటూరులో ఎస్సీ బాలికపై కొంతకాలంగా ఓ యువకుడు అతడి స్నేహితులతో కలిసి పదే పదే అత్యాచారం చేస్తున్నాడు. దీంతో బాలిక గర్భం దాల్చిన విషయం తాజాగా వెలుగు చూసింది. ఈ సమాచారం తెలిసినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం.. కనీసం కేసు నమోదు చేయకపోవడంపై విమర్శలకు తావిస్తోంది.

Bike Accident : పదో తరగతి విద్యార్థి ప్రాణాలు తీసిన బైక్‌ మోజు..

వివరాల్లోకి వెళ్తే.. ప్రొద్దుటూరు ఇస్లాంపురం వీధిలోని మసీదు వద్ద ఓ మైనర్ బాలిక భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. తండ్రి మరో ఆలయం వద్ద భిక్షాటన చేస్తుంటాడు. ఆమె తల్లి చాలా ఏళ్ల కిందట చనిపోయింది. అయితే ఆ బాలికపై అదే వీధిలో బంధువుల ఇంట్లో ఉంటూ ఓ డెకరేషన్‌ దుకాణంలో పని చేస్తున్న యువకుడు చెంబు కన్నుపడింది. దీంతో చెంబు, అతడి స్నేహితులు కొంతకాలంగా ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నెల 4న మహిళా కానిస్టేబుల్‌ మల్లీశ్వరి బాధితురాలితో మాట్లాడి అన్ని వివరాలను సేకరించింది. బాలిక చెప్పిన సమాచారం మొత్తాన్ని కానిస్టేబుల్‌ మల్లీశ్వరి వీడియో తీసింది. ఈ సందర్భంగా తనపై చెంబు, అతని స్నేహితులు అఘాయిత్యం చేసినట్లు బాధితురాలు వివరించింది. కానిస్టేబుల్ సీఐకి ఈ ఘటన వివరించగా ఆయన ఈ విషయం బయటకు పొక్కకుండా బాధితురాలిని ఆశ్రమానికి తరలించాడు. కాగా ప్రస్తుతం బాలిక మైలవరంలోని ఓ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతోంది.