Palabhishekam to CM YS Jagan’s Photo: సీఎం జగన్ ఫొటోకి మంత్రుల పాలాభిషేకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palabhishekam to CM YS Jagan’s Photo: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు బీసీ మంత్రులు.. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్ , మెరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరావు , మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఇతర నేతలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. వైఎస్ స్ఫూర్తితో వైసీపీ అధికారంల్లోకి వచింది.. సీఎం జగన్ బీసీల ఆశయ సాధకుడని తెలిపారు.. 18 స్థానాలకు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సింహ భాగం అంటే.. 11 స్థానాలు బీసీలకి, 3 స్థానాలు ఎస్సీ, ఎస్టీలకి ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి.. ఈ సందర్భంగా పాలాభిషేకం చేసి సీఎం జగన్ ని స్మరించుకోవడం ఆనందంగా ఉందన్నారు.. గత ప్రభుత్వం మాటల్లో మాత్రమే బీసీలను న్యాయం చేస్తే.. సీఎం జగన్ చేతల్లో న్యాయం చేశారంటూ ప్రశంసలు కురిపించారు.
Read Also: Kangana Ranaut: బాలీవుడ్ మాఫియా.. వారికి అవార్డులు ఏంటీ..?
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
విద్య, వైద్యంలో ప్రజలు అభివృద్ధి చెందుతారని నమ్మే వ్యక్తి సీఎం జగన్ అని పేర్కొన్నారు మంత్రి బొత్స.. అయన క్యాబినెట్ లో పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీ డిక్లరేషన్ చేసిన నాయకుడు జగన్ అంటూ గుర్తుచేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ఇక, సామజిక అసమానతను దూరం చేసిన నాయకుడు సీఎం జగన్… చంద్రబాబు దళితుల్లో పుట్టాలని కోరుకుంటారా? అంటూ అవమాన పరిచాడు.. కానీ, సీఎం జగన్.. గ్రామ స్థాయి నుండి అనేక పదవుల్లో మెజారిటీ పదవులు అణగారిన వారికి ఇచ్చారు. రాజకీయ ప్రాధాన్యత కలిగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు మంత్రి మేరుగ నాగార్జున..
Read Also: IPhone : హౌరా.. పాత ఐఫోన్కు 57 లక్షలా..? ఎందుకంత డిమాండ్..
మరోవైపు.. దేశ చరిత్రలో సీఎం జగన్ చిర స్థాయిలో నిలిచిపోతారు అంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి జోగి రమేష్.. కనీసం వార్డు పదవుల్లో కూడా లేని మా కులం వారికి ఎమ్మెల్సీ, ఎంపీ, రాజ్యసభలో అనేక పదవులు ఇచ్చారు.. ప్రజలు అందరూ.. అణగారిన వర్గాలు జగన్ కి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు పార్టీని బంగాళాఖాతాంలో కలపాలని వ్యాఖ్యానించారు మంత్రి జోగి రమేష్. ఇక, గతంలో చంద్రబాబు పదవులని అమ్ముకున్నాడు అని ఆరోపించారు మంత్రి కారుమూరి నాగేశ్వరావు.. చెప్పిన మాట నెలబెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 85 వేల కోట్లు బీసీల కోసం ఖర్చు చేశాడన్న ఆయన.. బీసీలు అందరం జగన్ వెంటే ఉంటామని ప్రకటించారు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంక్ గా చూశారు.. కానీ, సీఎం జగన్ వారికి బ్యాక్ బోన్గా ఉన్నారని పేర్రకొన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!