కేంద్ర పోర్టులు, ఓడరేవులు, జలమార్గాలు మంత్రి సబరనాథ్ సోనోవల్ ని కలిశారు ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి. గతంలో ఈ శాఖలకు కేంద్ర మంత్రిగా మనుసుఖ్ మాండవీయ నిర్వహించిన నేపథ్యంలో, ప్రస్తుత మంత్రి సోనోవల్ కి ఏపీ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి ప్రణాళికను మరోసారి వివరించిన రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.
రాష్ట్రంలోని 3 పోర్టులు, 11 ఫిషింగ్ హార్బర్ లకు అందించాల్సిన కేంద్ర నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టం ప్రకారం ఏపీలో మేజర్ పోర్టును గుర్తించి నివేదిక అందించాలని కేంద్ర మంత్రి సోనోవాల్ కోరారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన గత రెండున్నరేళ్ల కాలంలో ఏపీ మారిటైమ్ బోర్డును స్థాపించి, ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా “కోస్టల్ కారిడార్ డెవలప్ మెంట్” చేశామన్నది కేంద్ర మంత్రికి వివరించారు మంత్రి మేకపాటి.
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధికాభివధ్ది లక్ష్య సాధన లో ఏపీ ఏ విధంగా కీలకంగా వ్యవరిస్తుందన్న దానిపై కూలంకషంగా చర్చించామన్నారు మంత్రి మేకపాటి. 2030 కల్లా ప్రస్తుతం 4 శాతంగా ఉన్న ఎగుమతులను 10శాతం లక్ష్యంతో పనిచేస్తోందని కేంద్ర మంత్రి సోనోవాల్ కి రాష్ట్ర మంత్రి గౌతమ్ రెడ్డి వివరించారు. ఎగుమతులకు సంబంధించిన “వాణిజ్య ఉత్సవం – 2021”ని విజయవంతంగా నిర్వహించామన్నారు. ఏపీ కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులకూ సహకరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని మేకపాటి తెలిపారు.
