Kottu Satyanarayana: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలలో సామాన్యులకు పెద్దపీట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సచివాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలపై అధికారులతో డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సమీక్షించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు వెలంపల్లి, మల్లాది విష్ణు, కలెక్టర్ దిల్లీ రావు, దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్, పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా హాజరయ్యారు. ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను అధికారుల నుంచి మంత్రి కొట్టు సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు కల్పించే సౌకర్యాలపై మరింత దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్షించామని.. ఈ సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. వీఐపీలకు మూడు ప్రదేశాలలో టిక్కెట్ కౌంటర్లు ఏర్పాటుతో పాటు వాహనాలలో కొండపైకి తీసుకెళ్తామన్నారు. దసరా మహోత్సవాలలో సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని నిర్ణయించామని తెలిపారు. భక్తులకు అంతరాలయ దర్శనం ఉండదన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రసాదం కౌంటర్లు పెంచుతామని.. రైల్వే స్టేషన్, బస్ కాంప్లెక్సులలో కూడా ప్రసాదాల కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. లడ్డు నాణ్యత పెంచడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. నాణ్యత పెంచినా లడ్డూ ధర పెంచడం లేదని.. 15 రూపాయలే కొనసాగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో వీఐపీ టిక్కెట్లు కేటాయింపు ఉంటుందన్నారు. వీఐపీల కోసం, భక్తుల కోసం స్లాట్ విధానం పెట్టాలనుకున్నాం కానీ ఈ దసరా మహోత్సవాలలో స్లాట్ విధానం పెట్టడం లేదన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీ సిఫార్సు లేఖలకు రూ.500 వీఐపీ టిక్కెట్ల దర్శనం కల్పిస్తామని.. అన్ని శాఖల సమన్వయంతో దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. వాలంటీర్లకి క్యూ ఆర్ కోడ్తో గుర్తింపు కార్డు ఇస్తామని పేర్కొన్నారు. 500 రూపాయల టిక్కెట్లు కూడా స్కానింగ్ చేయాలని ఆలోచన చేస్తున్నామని తెలిపారు.
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!