Kottu Satyanarayana: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలలో సామాన్యులకు పెద్దపీట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సచివాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలపై అధికారులతో డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సమీక్షించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు వెలంపల్లి, మల్లాది విష్ణు, కలెక్టర్ దిల్లీ రావు, దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్, పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా హాజరయ్యారు. ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను అధికారుల నుంచి మంత్రి కొట్టు సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు కల్పించే సౌకర్యాలపై మరింత దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్షించామని.. ఈ సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. వీఐపీలకు మూడు ప్రదేశాలలో టిక్కెట్ కౌంటర్లు ఏర్పాటుతో పాటు వాహనాలలో కొండపైకి తీసుకెళ్తామన్నారు. దసరా మహోత్సవాలలో సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని నిర్ణయించామని తెలిపారు. భక్తులకు అంతరాలయ దర్శనం ఉండదన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రసాదం కౌంటర్లు పెంచుతామని.. రైల్వే స్టేషన్, బస్ కాంప్లెక్సులలో కూడా ప్రసాదాల కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. లడ్డు నాణ్యత పెంచడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. నాణ్యత పెంచినా లడ్డూ ధర పెంచడం లేదని.. 15 రూపాయలే కొనసాగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో వీఐపీ టిక్కెట్లు కేటాయింపు ఉంటుందన్నారు. వీఐపీల కోసం, భక్తుల కోసం స్లాట్ విధానం పెట్టాలనుకున్నాం కానీ ఈ దసరా మహోత్సవాలలో స్లాట్ విధానం పెట్టడం లేదన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీ సిఫార్సు లేఖలకు రూ.500 వీఐపీ టిక్కెట్ల దర్శనం కల్పిస్తామని.. అన్ని శాఖల సమన్వయంతో దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. వాలంటీర్లకి క్యూ ఆర్ కోడ్తో గుర్తింపు కార్డు ఇస్తామని పేర్కొన్నారు. 500 రూపాయల టిక్కెట్లు కూడా స్కానింగ్ చేయాలని ఆలోచన చేస్తున్నామని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!