Site icon NTV Telugu

పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి.. క్షమాపణ చెప్పాలి

నిన్న “రిపబ్లిక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యణ్ మాట్లాడిన మాటల పై స్పందిస్తూ… ముఖ్యమంత్రి, మంత్రుల పై చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకోవాలి. క్షమాపణ చెప్పాలి అని మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేసారు. పవన్ కళ్యణ్ తన వ్యాఖ్యల ద్వారా పలుచనైపోతున్నారు. సినిమా వేదికను రాజకీయ వేదికగా మార్చారు ఆయన. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోనే ఉండరు. ఆయన సినిమాలన్నీ ఫారెన్ లోనే తీస్తారు. మరి ఏపీలో ఎందుకు తీయరు అని ప్రశ్నించారు.

అలాగే పెద్దలు చిరంజీవి, మోహన్ బాబు పై కూడా ఆయన మాట్లాడిన తీరు సరైంది కాదు. సినిమాల్లోకి వచ్చి పదేళ్ల కూడా అవ్వని పవన్ కళ్యాణ్ మొత్తం ఇండస్ట్రీ అంతటికీ నష్టం జరుగుతుందని ఎలా మాట్లాడతారు. హిట్ సినిమాలు కొత్త కొత్త నటీనటులకి వస్తున్నాయి. డబ్బింగ్ సినిమాలను అదరించే గొప్ప అభిమానం తెలుగు ప్రేక్షకులది. మంత్రులను సన్నాసులు అంటున్నారు.. ఈ తరహా వ్యాఖ్యలు ఏ సిద్దాంతం నేర్పింది. టిక్కెట్ల ఆన్లైన్ విధానం పై ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత దూషణలు, బూతులు మాట్లాడుతున్నారు. పార్టీ అధినేత ఇలా మాట్లాడితే క్రింది స్థాయి నాయకులు, కార్యకర్తలు ఎలా ప్రవర్తిస్తారు అని అడిగారు. పార్టీని నడపాలంటే ఓర్పు, సహనం, ఉండాలి.. కానీ పవన్ బ్యాలెన్స్ తప్పుతున్నారు. బుద్ధుడు గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఓ పదిరోజులు ధ్యాన కేంద్రం లో గడిపితే మంచిది అని సూచించారు. విమర్శలు సహేతుకంగా ఉండాలి.. కానీ వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే మేము మాట్లాడగలం అని పేర్కొన్నారు.

Exit mobile version