Minister Appala Raju: లోకేష్ నడక మంచిదే.. ప్రజలకు ఒరిగేదేంటి?
ఏపీలో పాదయాత్రల విషయంలో ఒకరినొకరు పోటీపడుతున్నారు. తాజాగా టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్రపై తనదైన రీతిలో స వేశారు మంత్రి సీదిరి అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి మాట్లాడుతూ.. నడక చాలా మంచిది.. ముఖ్యంగా లోకేష్ లాంటి వ్యక్తులకు మరింత మంచిదని సలహా ఇచ్చారు. నడవడానికి పర్మిషన్లు అవసరం లేదు..నీవు నడవచ్చు లోకేష్.. నీ ఆరోగ్యం మెరుగు పరుచుకునే యాత్రకు యువగళం అనే పేరేందుకు…? లోకేష్ మీ నాన్న గారు యువకులకు చేసిన మోసం ..ఈ రాష్ట్రంలో ఏ యువకుడు మర్చి పోలేదు..?
బాబు వస్తే జాబు వస్తాదని అన్నావు.ఇంటికో ఉద్యోగం అన్నావు..ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు..? ఎన్ని కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగావు..? ముఖ్య మంత్రి యువ నేస్తం అని నిరుద్యోగులకు వెయ్యి రూపాయల చొప్పున ఇస్తానన్నావు.. ఎంతమందికి ఇచ్చావు..? మా నియోజకవర్గంలో 50 మందిని చూపించు . ముఖ్య మంత్రి యువ నేస్తం కాదిది…యువమోసం. మోసాల మీద వెన్నుపోట్ల మీద అధికారంలోకి వచ్చినటువంటి దౌర్భాగ్య చరిత్ర మీది. మీ నాన్నగారిది..అసెంబ్లీలో మాట్లాడటానికి గొంతు నొక్కే సారని మండిపడ్డారు.
Also Read
- AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
- AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
- Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
Read Also: Ravindar Gopala: ‘దేశంకోసం భగత్ సింగ్` ఆడియో ఆవిష్కరణ!
ప్రజల కష్టాలు తెలుసుకోడానికి జగన్ బయటకు రావడం జరిగింది.. నీవు , నీ కొడుకు తలక్రిందులుగా తపస్సు చేసినా అధికారంలోకి రాలేరని బలంగా చెబుతున్నాను.. జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను తగ్గించటానికి ప్రతి పక్షాలు రకరకాల జిమ్మిక్కులు, పగటి వేషాలు వేస్తున్నారు..మొన్నటి వరకు బాదుడే బాదుడని, మళ్లీ దారి పేరు మార్చి ఇదేం ఖర్మరా.. అని వస్తే ప్రజలు నిర్ద్వంద్వంగా తోచిపుచ్చారు.. పాదయాత్ర చేయడానికి రీజనేంటి…సమయం .. సందర్భం.. బలమైన కారణం ఉందా.? అని ప్రశ్నించారు.
కేవలం అధికార కాంక్ష, నీకోటరీలో నీకంటూ కోటరీ నిర్మించుకోవడం కోసం ..నీవు చేసిన యాత్రల వలన ప్రజలకు ఒరిగేదేమీ లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన, పారదర్శక పాలన ముందు ఎవరెన్ని వేషాలు, కుయుక్తులు పన్నినా పనికి రావు.. జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ శత శాతం న్యాయం చేయడానికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు మంత్రి అప్పలరాజు.
Read Also: Komatireddy Venkat Reddy : మీకు చదవాలని కోరిక ఉందా.. నేను చదివిస్తా
తాజావార్తలు
-
AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
-
Curd Rice Recipe: వడదెబ్బకు చెక్.. వేసవిలో చల్లని ఉపశమనం కోసం పెరుగన్నం.. ఇలా తయారు చేసుకోండి
-
Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
-
Kyle Jamieson: 15 ఏళ్ల కుర్రాడిపై అంత ఆవేశమేంటి భయ్యా.. వైభవ్ను అవుట్ చేసి జేమీసన్ అతి.. నెటిజన్ల ఫైర్!
-
Repolling in Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. 15 బూత్లలో రీపోలింగ్ ప్రారంభం
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!