మాఘ అమావాస్య నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సర్వ దోషాలు పటాపంచలైపోతాయి.ప్రతి నెల ఏదో ప్రత్యేకత ఉంటుంది. అలాగే మార్చినెలలో రెండవ తేదీన వచ్చే మాఘ అమవాస్య కు ఎంతో విశిష్టత వుంది. ఈ అమావాస్యనే మౌని అమావాస్య అని కూడా అంటారు. మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఎంతో గొప్పగా ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం ఆచరిస్తారు.. పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల ఒకరి పాపాలు , ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. ఈ రోజు, స్నానం చేసేటప్పుడు, కఠినమైన నిశ్శబ్దం పాటించాలి. ఈ రోజున గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ బ్రహ్మదేవుడిని పూజిస్తారు.
LIVE :మాఘ అమావాస్య నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే…
