Left Parties Meeting: మోడీ, జగన్ పోటీపడుతూ జనాన్ని దోచేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో వామపక్ష పార్టీ నేతల సమావేశం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల పై ఉద్యమం ఉధృతం చేయాలని నిర్ణయించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ …దేశంలో పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు. భారతదేశం మరో శ్రీలంక తరహాలో ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకోనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలు పోరాడతాయన్నారు.
ఈనెల 25వ తేదీన సచివాలయాల వద్ద నిరసన చేపడతున్నాం. ప్రజలు కూడా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి. ఏపీలో జగన్ పాలనతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మోడీ నియంతృత్వ నిర్ణయాలను ప్రశ్నించలేని దుస్థితి లో జగన్ ఉన్నారు. రాష్ట్రంలో పన్నులు, విద్యుత్ భారాలు పెంచారు. జగన్ మోడీ కనుసన్నల్లోనే పని చేస్తున్నారని శ్రీనివాసరావు ఆరోపించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జగన్ మోసం చేశారు. పొరాటాల ద్వారా పాలకుల్లో మార్పు రావాలన్నారు. ప్రజలు కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాల పై గళమెత్తాలి.
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత 16 రోజుల్లో 14 సార్లు పెట్రోల్ పెంచారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ..రెండు ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించడం లేదన్నారు. ఏపీలో పెట్రోల్, గ్యాస్ ధరలే కాదు సిమెంట్, ఇసుక, ఐరన్ ధరలు పెంచేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే ధరలు ఎక్కువ.
Read Also: Chandrababu : జగన్ రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రం రివర్స్
ఆస్తి పన్ను 32శాతం పెంచారు, చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఇది. విద్యుత్ ఛార్జీలు పెంచి కూడా ట్రూ అప్ ఛార్జీల పేరుతో మరోసారి దోపిడీకి సిద్ధమయ్యారు. అదానీ కంపెనీతో కుమ్మక్కై, వారిచ్చే కమిషన్ల కోసం ప్రజలపై విద్యుత్ భారాలు మోపారు. ప్రతిపక్షంలో విద్యుత్ అగ్రిమెంట్లు రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. సోలార్ విద్యుత్తును రాజస్థాన్ నుంచి కొనుగోలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయలేరా..? డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు. ప్రయాణికులపై భారం మోపారు.
ఇన్ని రకాలుగా భారాలు మోపినా.. 24 గంటలూ విద్యుత్ ఇవ్వలేక పోతున్నారు.మే 1వ తేదీ నుండి కరెంటు ఎలా వస్తుందో మంత్రి చెప్పాలి.ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం విద్యుత్ కొనలేని స్థితిలో ఉంది.మోడీ, జగన్ పోటీ పడుతూ ప్రజలను దోచుకుంటున్నారు.అన్ని రకాల ఛార్జీలు, పన్నుల భారాలు తగ్గించాలి.ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే వరకు మా పోరాటం కొనసాగుతుందన్నారు.
తాజావార్తలు
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
-
Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్… అసలేం జరుగుతోంది ?
-
2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్లో రో-కో ఆడతారా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!