Kurnool Crime: కుళాయి వద్ద ఘర్షణ.. పచ్చని పల్లెలో రక్తపాతం.. నలుగురి హత్య..!
- నీళ్ల పంచాయితీకి నలుగురు బలి..
- నీళ్ల కుళాయి దగ్గర చెలరేగిన పంచాయితీ.. పాత కక్షలుగా రూపాంతరం..
- ఇది కాస్తా ఫ్యాక్షన్ మర్డర్స్కు దారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool Crime: కర్నూలు జిల్లా అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఫ్యాక్షన్.. ఇపుడు ఆ పదం వినిపించడమే అరుదు. అలాంటి సమయంలో ఎమ్మిగనూరు మండలం కాందనాతిలో పాత కక్షలు చెలరేగి ఇద్దరు వేటకొడవళ్లకు బలయ్యారు. ఇంట్లో, పొలం వెళ్లే దారిలో, పొలంలో… ఇలా వెంటాడి వేటాడి హత్య చేశారు. ఏడాది క్రితం జరిగిన హత్యలకు ప్రతీకారమే ఈ హత్యలుగా తేల్చారు.. కందనాతిలో ముగ్గురు అన్నదమ్ముల కుటుంబలపై ప్రత్యర్థులు చెలరేగిపోయారు. పరమేష్ అనే వ్యక్తిని ఇంట్లోనే దారుణంగా నరికి హత్య చేశారు. ఇతర కుటుంబ సభ్యులు పొలంలో ఉన్నారని తెలిసి మూకుమ్మడిగా కొడవళ్లతో వెళ్లారు. పొలం పనులు పూర్తి చేసుకొని ట్రాక్టర్ లో గోవింద్ (45), భార్య వీరేషమ్మ వస్తుడగా వారిపైనా దాడి చేశారు. వేటకొడవళ్ల దాడిలో గోవింద్ పొట్ట చీలిపోయి పేగులు బయటికి వచ్చాయి. వీరేషమ్మ పై దాడి చేయబోగా వేటకొడవలి వేటు ఆమె ఐదేళ్ల కుమారుడు లోకేంద్ర కు పది తీవ్రంగా గాయపడ్డారు. వీరేషమ్మ కేకలు వేయడంతో ప్రత్యర్థులు పొలం వైపు వెళ్లారు. పొలంలో ఉన్న వెంకటేష్ ను కూడా నరికి చంపేశారు. గాయపడిన గోవిందు, ఐదేళ్ల బాలుడు లోకేంద్ర ను కర్నూలు ఆసుపత్రికి తరలించారు.
Read Also: Rahul Gandhi: వియత్నాం టూర్లో రాహుల్ గాంధీ.. ‘‘పార్టీ-టూరిజం’’ లీడర్ అని బీజేపీ ఫైర్..
Also Read
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
- Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
- YS Jagan Kurnool Tour: కర్నూలులో నేడు జగన్ పర్యటన.. పోలీసుల అనుమతి.. షరతులు ఇవే..!
ఈ హత్యలకు పాత కక్షలు కారణంగా పోలీసులు తేల్చారు. గత ఏడాది ఫిబ్రవరిలో కంధనాతిలో దేవర ఉత్సవాలు జరుగుతుండగా రెండు కుటుంబాల మధ్య నీటి కుళాయి వద్ద ఘర్షణ జరిగింది. ఆ రెండు కుటుంబాలు అప్పుడు ఒకరు వైసీపీలో ఉండగా , మరొకరు టీడీపీలో వున్నారు. ఇరు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక కుటుంబానికి చెందిన బిక్కి నరసింహులు, ఆయన కుమారుడు రవి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన తరువాత వారి ప్రత్యర్థులు వెంకటేష్, పరమేష్, గోవిందు కుటుంబాలు ఊరు వదిలి వెళ్లిపోయారు. ఈ ఏడాది దసరా పండగ సందర్భంలో వెంకటేష్, గోవిందు, పరమేష్ కుటుంబాలు తిరిగి తమ గ్రామం చేరుకున్నారు. అయితే ఈసారి ఈ మూడు కుటుంబాల వారు టీడీపీలో చేరారు. దీంతో ధైర్యంగానే ఊరు చేరుకున్నారు. అయితే, గత ఏడాది జరిగిన హత్యలతో రగిలిపోతున్న ప్రత్యర్థులు వెంకటేష్, పరమేష్ ను దారుణంగా నరికి హత్య చేశారు.
కందనాతిలో ఈ నెల 5న జరిగిన జంట హత్యల కేసులో రెండు విడతలుగా 25 మంది నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల నుండి ట్రాక్టర్, రెండు బైక్ లు, రెండు ఇనుప గడ్డపారలు, ఒక ఇనుప రాడ్, రెండు వేట కొడవళ్లు స్వాధీనం చేసుకున్నారు. కేవలం ఇంటి దగ్గర నీటి కుళాయి వద్ద జరిగిన ఘర్షణ గ్రామంలో నలుగురి హత్యకు దారితీసింది. ఏడాదిగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినా హత్యలు జరిగాయి. ఎమ్మిగనూరు జాతరకు బందోబస్తులో పోలీసులు ఉండగా ఇదే అవకాశంగా చెలరేగి హత్యలకు పాల్పడ్డారు. ఇరువర్గాలు జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
-
JrNTR : ఆదర్శకుటుంబానికి తోడుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్
-
Asia Cup 2026: జిత్తులమారి వస్తున్నాడు.. టీమిండియాకు మరోసారి ట్రోఫీ వివాదం తప్పదా?
-
Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
-
Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!