BY Ramaiah: విలేకరుల వీపు వాయగొడతాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని వార్తాపత్రికలకు చెందిన విలేకరులను ఉద్దేశించి కర్నూలు మేయర్ బీవై రామయ్య స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తే.. వీపులు వాయగొడతామని హెచ్చరించారు. ‘సామాజిక న్యాయభేరి’ సభలో మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉందని ప్రజలు నీడ చాటుకు వెళ్లారని, ఆ సమయంలో ఖాళీగా ఉన్న కుర్చీల ఫోటోలు తీసి సభకు జనాలు రాలేదంటూ కొన్ని పత్రికలు పనికట్టుకుని ప్రచారం చేశాయని ఆయన ఆగ్రహించారు. అలాంటి తప్పుడు వార్తలు రాసిన వారి వీపులు వాయగొడతామని అన్నారు. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా ఉండే పాత్రికేయ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం మేయర్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ.. మీడియా ప్రతినిధులకి క్షమాపణ చెప్పాలని సూచించారు. వైసీపీ సామాజిక న్యాయభేరీకి జనాలు రారని.. ఒకవేళ అధికారాన్ని ఉపయోగించుకొని బెదిరించో లేక బ్రతిమాలో జనాల్ని తెచ్చుకున్నా, అసలు సమయానికి పారిపోతున్నారని లోకేష్ అన్నారు. ‘ఇదే విషయాన్ని వివరిస్తూ వాస్తవాలు రాసేవారిని, చూపించే మీడియా ప్రతినిధుల వీపు వాయగొడతారా! ఇదేం రౌడీయిజం?’ అని నిలదీశారు. అధికారంలో వున్నాం కదా అని మత్తులో ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకోవద్దని.. వీపులు మీడియా వాళ్లకే కాదు, మీకూ వుంటాయని హెచ్చరించారు. మీ వీపులు ఎప్పుడెప్పుడు మోగిద్దామా అంటూ నాలుగు కోట్లకి పైగా వున్న ఏపీ ఓటర్లు ఎదురు చూస్తున్నారని నారా లోకేష్ వెల్లడించారు.
Also Read
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
తాజావార్తలు
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!