Site icon NTV Telugu

Penamaluru Gold Scam: తక్కువ ధరకే బంగారు నాణాలు అంటూ రూ.20.25 లక్షలు టోకరా..

Fake Gold Coin Scam

Fake Gold Coin Scam

Penamaluru Gold Scam: కృష్ణా జిల్లా పెనమలూరులో తక్కువ ధరకు బంగారు నాణాలు అంటూ ఆశచూపి 20.25 లక్షలకు టోకరా వేసిన ఘటన జరిగింది. విజయవాడలో బస్సు డ్రైవర్ గా నరసరావుపేటకి చెందిన తిరుపతి రెడ్డి పనిచేసున్నారు. పెనమలూరులో తనకు తెలిసిన వ్యక్తి వద్ద బిల్లులు లేని బంగారు నాణాలు ఉన్నాయని ఇటీవల తిరుపతి రెడ్డికి బంధువు నరసింహ రెడ్డి చెప్పారు. తక్కువ ధరకు బంగారం ఇస్తారన్న శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని పరిచయం చేశాడు బంధువు నరసింహ రెడ్డి. వీడియో కాల్ చేసి శ్రీనివాస్ రెడ్డిని బాధితుడు తిరుపతి రెడ్డి మాట్లాడారు. వీడియో కాల్ లో తన వద్ద ఉన్న కొన్ని బంగారు నాణాలను శ్రీనివాసరెడ్డి చూపించారు. వీడియో కాల్ లో బంగారు నాణాలు చూసి వాటి కొనుగోలుకి బాధితుడు అంగీకరించాడు. 20 గ్రాములున్న 17 నాణాలు 37.40 లక్షల విలువ ఉంటాయని చెప్పగా తన వద్ద 20.50 లక్షల నగదు మాత్రమే ఉందని తెలిపిన తిరుపతి రెడ్డి చెప్పాడు.

Read Also: Pawan Kalyan : సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవర్ స్టార్.. ముహూర్తం పెట్టేసారు

ఇక, నగదు తీసుకుని పెనమలూరు శివారు గంగూరు డిమార్ట్ వద్దకు రమ్మని కేటుగాళ్లు చెప్పటంతో ఈనెల 2న రూ.20.50 లక్షల నగదు తీసుకుని పెనమలూరు డిమార్ట్ వద్దకు వెళ్ళి బాధితులు డబ్బులు తీసుకెళ్లగా.. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి రోడ్డు అవతల వైపు కారులో నాణాలు ఉన్నాయని చెప్పాడు. నగదు బ్యాగ్ తనకు ఇచ్చి కారు వద్దకు వెళ్లాలని చెప్పటంతో నాణాలు తీసుకునేందుకు తిరుపతి రెడ్డి, మరో బంధువు మల్లారెడ్డి ప్రయత్నించారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఒక్కసారిగా కారుతో నిందితులు కారులో ఉడాయించారు. కారు స్టార్ట్ చేశారని తెలుసుకోని డోర్ ని తిరుపతి రెడ్డి పట్టుకోగా పడిపోయిన తిరుపతి రెడ్డికి గాయాలు అవగా ఆసుపత్రికి తరలించారు. మోసపోయినట్లు గుర్తించి బాధితులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Exit mobile version