Kakani Govardhan Reddy: మంత్రి అంటే పదవి కాదు.. బాధ్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి అంటే పదవి కాదు..బాధ్యత. అందరి సూచనలతో రాష్ట్రాన్ని వ్యవసాయ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. మంత్రి అయినా..రాష్ట్ర స్థాయి బాధ్యతలు వున్నా అందరికీ అందుబాటులో ఉంటానన్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. ఆదాల ప్రభాకర్ రెడ్డి …నేను కలిసి పని చేశాం. నేను ఈ స్థాయికి రావడానికి ఆనం కుటుంబం ఎంతో దోహదం చేసింది.
వ్యవసాయ శాఖ అంటే ఎంతో కీలకం. 70 శాతం మంది ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. మంత్రిగా అవకాశం కల్పించిన జగన్ కు కృతజ్ఞతలు. జెడ్పీ ఛైర్మన్ గా ఎలా సహకరించారో..అదే విధంగా మంత్రిగా నా వేలు సట్టుకుని నడిపించాలని కోరుతున్నానన్నారు కాకాణి. వై.ఎస్.ఆర్…జగన్ హయాంలో వర్షాలు కురిసే రైతులు సంతోషంగా ఉన్నారు.
Also Read
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
Read Also:Anilkumar Yadav: 2024లో మళ్ళీ గెలుస్తాం…అంతా కేబినెట్లోకి వస్తాం
రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. రాష్ట్రంలో ఒకేసారి 5 వేల ట్రాక్టర్లను రైతులకు ఇస్తాం. ఆర్.బి.కె.లను గవర్నర్ ప్రశంసించారు. వాటి పనితీరులో ఉన్న లోపాలను సవరిస్తాం. పవన్ కల్యాణ్, చంద్రబాబులు రైతుల పై మొసలి కన్నీరు కారుస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ళకు రూ.3 వేల కోట్ల ను స్థిరీకరణ నిధిని జగన్ ఏర్పాటు చేశారు. రైతులు నష్టపోకుండా చూస్తాం అన్నారు మంత్రి కాకాణి. నెల్లూరు జిల్లాలో రైతులు ఇబ్బంది పడకుండా చూస్తాం. పెండింగులో ఉన్న పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. వ్యవసాయనికి సంబంధించిన శాఖలను సమన్వయం చేసి రైతులకు ప్రయోజనం కలిగేలా చూస్తాం. మంత్రిగా అందరికీ అందుబాటులో వుంటానన్నారు.
మంత్రి కాకాణి సభకు ఎంపీలుఆదాల ప్రభాకర్ రెడ్డి..మాగుంట శ్రీనివాసులు రెడ్డి..మద్దెల గురుమూర్తి..ఎం.ఎల్ ఏ.లు ఆనం రామనారాయణ రెడ్డి..మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి..మానుగుంట మహీధర్ రెడ్డి. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి..ఎం.ఎల్.సి. బల్లి కళ్యాణ్ చక్రవర్తి..నెల్లూరు రూరల్ ఎం.ఎల్.ఏ.సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నేతలు. ప్రజలు..అభిమానులు భారీగా హాజరయ్యారు. మాజీ మంత్రి అనిల్ సభకు హాజరుకాలేదు.
తాజావార్తలు
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..