Site icon NTV Telugu

పీపీలు స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారు : జస్టిస్ ఎన్వీ రమణ

కానూరు సిద్ధార్ధ ఇంజనీరింగ్ కళాశాలకు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఘనస్వాగతం పలికారు విద్యార్ధులు. లావు వెంకటేశ్వర్లు స్మారకోపన్యాస సభలో భారత న్యాయవ్యవస్థ భవిష్యత్తు సవాళ్లు అంశంపై సీజేఐ మాట్లాడారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ప్రభుత్వం కంట్రోల్లో ఉంటారు. దీంతో పీపీలు స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారు అన్నారు. పీపీల నియామకంలో ప్రత్యేకంగా స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా 4.60 లక్షలు కేసులు పెండింగులో ఉన్నాయి. ఒక మిలియనుకు 21 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. 46 శాతం మేర కేసులు ప్రభుత్వాలకు సంబంధించినవే ఉన్నాయి. వాటిల్లో ఎక్కువగా భూ సంబంధిత వ్యవహారాలే ఉంటున్నాయి అని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ లావు నాగేశ్వరరావు , జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ పి.ఎస్ నరసింహ, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ పాల్గొన్నారు.

Exit mobile version