JC Prabhakar Reddy: ముసలోడు అయినా చంద్రబాబే మేలంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురం: టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని.. ముసలోడు అయినా చంద్రబాబే మేలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు పల్లెలన్నీ తిరుగుతున్నారని.. వాలంటీర్ను వెంటబెట్టుకుని వెళ్లి మరీ జగనన్నను దీవించాలని ప్రాధేయపడుతున్నారని జేసీ ప్రభాకర్రెడ్డి ఎద్దేవా చేశారు.
వైసీపీకి ఈరోజు కార్యకర్తలు లేరని.. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని జేసీ ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేల వెంట సచివాలయం సిబ్బంది, అధికారులు, పోలీసులు వెళ్తున్నారని విమర్శలు చేశారు. ఓ ఎంపీ అయితే ప్రజల పల్స్ పట్టుకోవాలి.. టీడీపీ వాళ్ళను లాక్కురండి అని వాలంటీర్లతో చెప్తుండటాన్ని తాను గమనించానన్నారు. సీఎం జగన్ వస్తున్నాడటంటే షాపులు మూసివేయాల్సిన పరిస్థితి నెలకొందని.. బందోబస్తులో 600 మంది పోలీసులు ఉంటున్నారని.. అంటే ప్రభుత్వం ఏ స్థాయిలో భయపడుతుందో అర్ధం చేసుకోవచ్చన్నారు. చంద్రబాబును మూసలోడు అంటున్నారని.. అయినా ఆయన బయట తిరుగుతున్నాడని జేసీ ప్రభాకర్రెడ్డి గుర్తుచేశారు.
Also Read
- Siva Narayana Reddy: ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ కడితే.. ఏపీలో ఒక భర్త తన భార్య కోసం ఏం చేశాడో చూడండి!
- AP Weather Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక.. ఈ జిల్లాలు అప్రమత్తం!
- CM Chandrababu Naidu: 'సీమలో సీన్ మారింది'.. ఫ్యాక్షన్ రాజకీయాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Saikrishna Mother Vijayalakshmi: "నా కొడుకు పవన్ కళ్యాణ్ అభిమాని.. క్రిమినల్ అని ఎలా అంటారు?".. సాయికృష్ణ తల్లి ఆగ్రహం..
పోలీసు అనే మహా వృక్షం కింద వైసీపీ పార్టీ ఉందని… ఆ పార్టీపై కార్యకర్తల్లో ద్వేషం చాలా ఉందని జేసీ ప్రభాకర్రెడ్డి అన్నారు. టీడీపీ వాళ్లు ఇప్పటికే మూడేళ్లు ఇంట్లో కూర్చున్నారని.. తమ కార్యకర్తలు జైళ్లకు వెళ్లారని.. స్థానిక ఎన్నికల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. గతంలో తాను మాట్లాడితే 14 మంది వైసీపీ నేతలు తనపై మాట్లాడేవారన్నారు. టీడీపీ నేతలందరూ చంద్రబాబును సీఎంను చేసుకోవాలని.. అందుకోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటికే సీటు తమకే కావాలని చాలా మంది సీనియర్ నేతలు అడుగుతున్నారని.. అయితే తమ నాయకుడు సీటు ఇవ్వనని.. త్యాగాలు చేయాలని సూచిస్తున్నారని జేసీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Siva Narayana Reddy: ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ కడితే.. ఏపీలో ఒక భర్త తన భార్య కోసం ఏం చేశాడో చూడండి!
-
Iran: ఖమేనీ అంత్యక్రియల వేళ మొజ్తబాపై కొత్త పుకార్లు.. ఇరాన్లో చర్చోపచర్చలు
-
Ketan Agarwal murder: నా కూతురు ‘‘మిడిల్ ఫింగర్’’ చూపలేదు: సియా తండ్రి వివరణ..
-
Varanasi: వారణాసిలో మహేష్ బాబు రాముడి లుక్ లీక్? నెట్టింట వైరల్ అవుతోన్న పిక్.. అసలు నిజం ఇదే!
-
Telangana Job Mela : తెలంగాణలో జాబ్ మేళా.. యువతకు గుడ్ న్యూస్.!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..