JanaSena: అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు జనసేన సాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నమయ్య ప్రాజెక్టు విషాదానికి ఏడాది గడిచింది.. ఈ ప్రాజెక్టు తెగిపోవడంతో అపార ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.. ఏకంగా 39 మంది ప్రాణాలు కోల్పోగా.. ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట, నందలూరు మండలాల పరిధిలోని పులపత్తూరు, మందపల్లె, తొగూరుపేట, గుండ్లూరు, రామచంద్రాపురం గ్రామాలు తీవ్రంగా నష్టాన్ని చవిచూశాయి.. బాధితులు రోడ్డున పడ్డారు. అయితే, అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు సాయం అందించేందుకు జనసేన పార్టీ.. రేణిగుంటలో ఇవాళ మీడియాతో మాట్లాడిన జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకు పోవడంపై ఎంక్వైరీ రిపోర్ట్ను ఇప్పటికైనా ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేశారు.. డ్యాం కొట్టుకుపోయి ఏడాది అయినా.. నిర్వాసితులకు ప్రభుత్వం సాయం అందించలేదని విమర్శించారు.. నెల లోపు ప్రభుత్వం నిర్వాసితులను ఆదుకోకపోతే అన్నమయ్య కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు..
Read Also: Traffic Rules : ట్రాఫిక్ పోలీస్ కొత్త రూల్స్.. రాంగ్ సైడ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే భారీగా జరిమానా
Also Read
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
- OTR: గూడూరు వైసీపీలో ఇంచార్జ్ మార్పు చిచ్చు.. నేతలను బుజ్జగించేందుకు మిథున్ రెడ్డి ఎంట్రీ
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
ఇక, జనసేన జనసేన నేతల పర్యటన నేపథ్యంలో హౌసింగ్ శాఖ.. బాధితుల ఖాతాల్లో డబ్బులు వేసినట్లు ప్రచారం చేసిందని మండిపడ్డారు… కానీ, ఏ ఒక్క బాధితుడికి రూపాయి కూడా ప్రభుత్వం ఇచ్చింది లేదని విమర్శించారు.. అయితే, వచ్చే వారం బాధితులకు మరోసారి జనసేన సాయం అందిస్తుందని ప్రకటించారు. నిర్వాసితులకు సాయం చేయలేని వైఎస్ జగన్మోహన్రెడ్డికి సీఎంగా కొనసాగే అర్హతలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నాదెండ్ల మనోహర్. కాగా, ప్రాజెక్టు పునర్నిర్మాణ విషయంపై ఇప్పటికే స్పందించింది ఏపీ ప్రభుత్వం.. 2.25 టీఎంసీల సామర్థ్యంతో, అదే స్థలంలో రూ.801కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించడానికి ఇటీవల పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఇక, ఇళ్లు కొట్టుకుపోయిన బాధితులకు ఇళ్లు నిర్మించి ఇస్తామని, పంట నష్టం వాటిల్లిన రైతులకు ఎకరాకు రూ.12,500 పరిహారం, వేలాది ఎకరాల పొలాలు ముంపునకు గురై ఇసుకతో నష్టపోయిన రైతులకు పరిహారం, యువతకు ఉపాధి కల్పిస్తామని గతంలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. రెండు మండలాల్లోని బాధిత కుటుంబాలన్నింటిలో ఒక్కటి కూడా ఇంతవరకు అమలు కాలేదని, ఏడాది గడిచినా ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో విఫలమైందని జనసేన ఆరోపిస్తోంది.. సరిగ్గా ఏడాది క్రితం నవంబర్ 18-19 రాత్రి వరదలు సంభవించిన ఒక రోజు తర్వాత తమ పార్టీ కార్యకర్తలు మరియు మహిళా సభ్యులే బాధితులకు చేరుకుని, ఆహారధాన్యాలు, ఆహార ప్యాకెట్లు, మందులు, ఇంటింటికీ సందర్శించి సహాయ సామగ్రిని అందించారని ఆయన గుర్తు చేశారు నాదెండ్ల మనోహర్.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!