Nara Lokesh: లోకేష్ పాదయాత్రలో అపశృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది.. లోకేష్ పాదయాత్ర బందోబస్తులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ గుండెపోటుతో మృతి చెందారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో సాగుతున్న పాదయాత్రలో రమేష్ కుప్పకూలాడు.. వెంటనే అప్రమత్తమైన సహచర పోలీసులు.. అతన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే, రమేష్.. ఐరాల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేసేవారు. పాదయాత్ర కాన్వాయ్ నిర్వహణలో ఉండగా గుండెపోటు వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. కాగా, కుప్పం నుంచి ప్రారంభమైన లోకేష్ యువగళం పాదయాత్ర 14వ రోజుకు చేరింది..
జీడి నెల్లూరు నియోజకావర్గం, రంగాపురం క్రాస్ వద్ద లోకేష్ మాట్లాడుతూ.. పరదాలు లేకుండా బయటకి రాలేని జగన్, నా పాదయాత్రను అడుగడుగునా అడ్డుకుంటున్నారని విమర్శించారు.. జగన్ సహకరిస్తే పాదయాత్ర, సహకరించకపోతే దండయాత్ర చేస్తానని ప్రకటించారు.. లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికి వందల మంది పోలీసులా? అని ప్రశ్నించారు. ఒక పోలీసు అధికారి రఘురామిరెడ్డి అత్యుత్సాహం చూపిస్తున్నాడు, అధికారంలోకి వచ్చేది మేమే, అప్పుడు చూపిస్తాం అని హెచ్చరించారు.. 2024లో ఐపీఎస్ అధికారులు జైలుకు వెళ్లి కార్యక్రమాలు ఉండబోతున్నాయని వార్నింగ్ ఇచ్చారు.. ఏ పోలీసులు అయితే రాజారెడ్డి రాజ్యాంగ అమలు చేస్తున్నారో వారు జైలుకే.. నా పైన 19 కేసులు పెట్టారు, ఎన్నైనా పెట్టుకో నేను భయపడనన్న లోకేష్.. ఎన్నో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని ఆరోపించారు.. ఎన్నికల ముందు పెంచుకుంటు పోతాను అంటే ఏమో అనుకున్నాము, కానీ నిత్యావసర వస్తువులు, మద్యం, కరెంట్ బిల్, పన్నులు పెంచుకుంటూ పోతున్నారని.. మనం పీల్చే గాలికి పన్ను వేస్తారేమో? అని ఎద్దేవా చేశారు నారా లోకేష్.
Also Read
- Polavaram-Banakacherla: పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్కు కేంద్రం బ్రేక్.. ప్రతిపాదన వెనక్కి
- Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
మరోవైపు.. లోకేష్ పాదయాత్ర పై మంత్రి వేణు సైటర్లు వేశారు.. లోకేష్ దొడ్డి దారిన మంత్రి అయ్యాడని విమర్శలు గుప్పించిన ఆయన.. చంద్రబాబు సభలో ఏడుగురి చావు కి కారణం అయ్యాడు.. ఇప్పుడు లోకేష్ కానిస్టేబుల్ ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అసలు రాష్ట్రంలో ఏమి లోటు ఉందని లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు అంటూ నిలదీశారు మంత్రి వేణు..
తాజావార్తలు
-
Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
-
Chiranjeevi: ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి.. అసలు నిజం ఇదే!
-
UP: అసెంబ్లీలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత
-
Star Kids: ‘శ్రీనివాస మంగాపురం’ బాక్సాఫీస్ రిజల్ట్ స్టార్ వారసులకు హెచ్చరికేనా?
-
Polavaram-Banakacherla: పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్కు కేంద్రం బ్రేక్.. ప్రతిపాదన వెనక్కి
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!