Minister Nadendla: కృష్ణానదికి భారీగా వరద నీరు.. లంక గ్రామాల ప్రజలకు మంత్రి నాదెండ్ల అలర్ట్!
- తెనాలి నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల పర్యటన..
- ముంపుకు గురైన ప్రాంతాలు, పొలాల వివరాలను అధికారుల నుంచి సేకరించిన మంత్రి..
- లంక గ్రామాల ప్రజలను అలర్ట్ చేయాలని అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nadendla: గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. కొల్లిపర మండలం కరకట్ట లంక ప్రాంతాలు, తెనాలి మండలం గోలి డొంక పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టంపై రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ముంపునకు గురైన ప్రాంతాలు, పొలాల వివరాలను అధికారుల ద్వారా మంత్రి సేకరించారు.
Read Also: Ownly: ‘ఓన్లీ’ ప్రారంభించిన ర్యాపిడో.. స్విగ్గీ, జొమాటోల ఆధిపత్యానికి సవాల్!
Also Read
- Ambati Rambabu: పోలీసులను రాజకీయ కక్షకు వాడుతున్నారు.. అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
ఇక, మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఆకాల వర్షాలతో రైతులు కొంత ఇబ్బందులు పడుతున్నారు.. 5 నెలల్లో పడాల్సిన వర్షం 2 గంటల్లో పడటం వల్ల కొంత పంట నీట మునిగింది.. ఇప్పటి వరకు 14 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.. ఇంకా పంట నష్టం వివరాలు రావాల్సి ఉంది.. కృష్ణ వరద నీరుకి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.. కొల్లిపర మండలంలో కొన్ని గ్రామాలు పంట నష్టం వాటిల్లింది.. ప్రభుత్వం రైతులను, కౌలు రైతులను కూడా ఆదుకుంటుంది.. విత్తనాలపై ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు అందిజేస్తామని మంత్రి నాదెండ్ల తెలియజేశారు.
Read Also: Supreme Court : ఈ నెల 19లోగా ఓట్లు తొలగించిన వారి జాబితా ఇవ్వాలన్న సుప్రీంకోర్టు.
అయితే, ముంపు గ్రామాల్లో అన్ని రకాల నిత్యావసర సరుకులు వసతులు రెండు బోట్లు ఏర్పాటు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వర్షాల వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. లంక గ్రామాలలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు సూచనలు చేశాం.. రెండు రోజులుగా భారీ వర్షాలతో జనం ఇబ్బందులు పడ్డారు.. ఇప్పటికే కృష్ణానది తీర ప్రాంతంలోని ప్రజలను అలర్ట్ చేశామన్నారు. లంక గ్రామాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు గురువారం పర్యటించారు. నీట మునిగిపోయిన పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడిన అనంతరం అక్కడే అధికారులకి దిశానిర్దేశం చేశారు.#nadendlamanohar pic.twitter.com/QTRV4MMr7F
— apcsmin (@apcsmin) August 14, 2025
తాజావార్తలు
-
Dharmasthala Case: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. కోర్టుకు 7000 పేజీల నివేదిక..
-
Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
-
Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
-
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
-
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!