Minister Nadendla: కృష్ణానదికి భారీగా వరద నీరు.. లంక గ్రామాల ప్రజలకు మంత్రి నాదెండ్ల అలర్ట్!
- తెనాలి నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల పర్యటన..
- ముంపుకు గురైన ప్రాంతాలు, పొలాల వివరాలను అధికారుల నుంచి సేకరించిన మంత్రి..
- లంక గ్రామాల ప్రజలను అలర్ట్ చేయాలని అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nadendla: గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. కొల్లిపర మండలం కరకట్ట లంక ప్రాంతాలు, తెనాలి మండలం గోలి డొంక పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టంపై రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ముంపునకు గురైన ప్రాంతాలు, పొలాల వివరాలను అధికారుల ద్వారా మంత్రి సేకరించారు.
Read Also: Ownly: ‘ఓన్లీ’ ప్రారంభించిన ర్యాపిడో.. స్విగ్గీ, జొమాటోల ఆధిపత్యానికి సవాల్!
Also Read
ఇక, మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఆకాల వర్షాలతో రైతులు కొంత ఇబ్బందులు పడుతున్నారు.. 5 నెలల్లో పడాల్సిన వర్షం 2 గంటల్లో పడటం వల్ల కొంత పంట నీట మునిగింది.. ఇప్పటి వరకు 14 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.. ఇంకా పంట నష్టం వివరాలు రావాల్సి ఉంది.. కృష్ణ వరద నీరుకి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.. కొల్లిపర మండలంలో కొన్ని గ్రామాలు పంట నష్టం వాటిల్లింది.. ప్రభుత్వం రైతులను, కౌలు రైతులను కూడా ఆదుకుంటుంది.. విత్తనాలపై ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు అందిజేస్తామని మంత్రి నాదెండ్ల తెలియజేశారు.
Read Also: Supreme Court : ఈ నెల 19లోగా ఓట్లు తొలగించిన వారి జాబితా ఇవ్వాలన్న సుప్రీంకోర్టు.
అయితే, ముంపు గ్రామాల్లో అన్ని రకాల నిత్యావసర సరుకులు వసతులు రెండు బోట్లు ఏర్పాటు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వర్షాల వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. లంక గ్రామాలలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు సూచనలు చేశాం.. రెండు రోజులుగా భారీ వర్షాలతో జనం ఇబ్బందులు పడ్డారు.. ఇప్పటికే కృష్ణానది తీర ప్రాంతంలోని ప్రజలను అలర్ట్ చేశామన్నారు. లంక గ్రామాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు గురువారం పర్యటించారు. నీట మునిగిపోయిన పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడిన అనంతరం అక్కడే అధికారులకి దిశానిర్దేశం చేశారు.#nadendlamanohar pic.twitter.com/QTRV4MMr7F
— apcsmin (@apcsmin) August 14, 2025
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!