Minister Nadendla: కృష్ణానదికి భారీగా వరద నీరు.. లంక గ్రామాల ప్రజలకు మంత్రి నాదెండ్ల అలర్ట్!
- తెనాలి నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల పర్యటన..
- ముంపుకు గురైన ప్రాంతాలు, పొలాల వివరాలను అధికారుల నుంచి సేకరించిన మంత్రి..
- లంక గ్రామాల ప్రజలను అలర్ట్ చేయాలని అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nadendla: గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. కొల్లిపర మండలం కరకట్ట లంక ప్రాంతాలు, తెనాలి మండలం గోలి డొంక పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టంపై రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ముంపునకు గురైన ప్రాంతాలు, పొలాల వివరాలను అధికారుల ద్వారా మంత్రి సేకరించారు.
Read Also: Ownly: ‘ఓన్లీ’ ప్రారంభించిన ర్యాపిడో.. స్విగ్గీ, జొమాటోల ఆధిపత్యానికి సవాల్!
Also Read
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
- Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
- Divyang Shakti Scheme: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారికోసం మరింత ఆలోచన చేస్తాం..
ఇక, మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఆకాల వర్షాలతో రైతులు కొంత ఇబ్బందులు పడుతున్నారు.. 5 నెలల్లో పడాల్సిన వర్షం 2 గంటల్లో పడటం వల్ల కొంత పంట నీట మునిగింది.. ఇప్పటి వరకు 14 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.. ఇంకా పంట నష్టం వివరాలు రావాల్సి ఉంది.. కృష్ణ వరద నీరుకి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.. కొల్లిపర మండలంలో కొన్ని గ్రామాలు పంట నష్టం వాటిల్లింది.. ప్రభుత్వం రైతులను, కౌలు రైతులను కూడా ఆదుకుంటుంది.. విత్తనాలపై ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు అందిజేస్తామని మంత్రి నాదెండ్ల తెలియజేశారు.
Read Also: Supreme Court : ఈ నెల 19లోగా ఓట్లు తొలగించిన వారి జాబితా ఇవ్వాలన్న సుప్రీంకోర్టు.
అయితే, ముంపు గ్రామాల్లో అన్ని రకాల నిత్యావసర సరుకులు వసతులు రెండు బోట్లు ఏర్పాటు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వర్షాల వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. లంక గ్రామాలలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు సూచనలు చేశాం.. రెండు రోజులుగా భారీ వర్షాలతో జనం ఇబ్బందులు పడ్డారు.. ఇప్పటికే కృష్ణానది తీర ప్రాంతంలోని ప్రజలను అలర్ట్ చేశామన్నారు. లంక గ్రామాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు గురువారం పర్యటించారు. నీట మునిగిపోయిన పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడిన అనంతరం అక్కడే అధికారులకి దిశానిర్దేశం చేశారు.#nadendlamanohar pic.twitter.com/QTRV4MMr7F
— apcsmin (@apcsmin) August 14, 2025
తాజావార్తలు
-
Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
-
Kayadu Lohar : ఆగస్టును ఆక్రమించిన అస్సాం భామ
-
Jonna Sangati Recipe : ఆరోగ్యానికి సిరి జొన్న సంగటి.. పాతకాలం నాటి బలమైన ఆహారం తయారీ విధానం ఇదే.!
-
Tamil Nadu: గవర్నర్ పచ్చజెండా.. రేపు మ.3:15కి సీఎంగా విజయ్ ప్రమాణం
-
UFO Files: ఏలియన్ల గుట్టు రట్టు.. చరిత్రలో తొలిసారిగా ‘UFO’ రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా!