Home Minister Anita: పోలీసులకు కోటి రూపాయల వరకు బీమా కల్పించాం..
- వెలగపూడిలో కొత్త సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం ప్రారంభం..
- రాజధాని కోసం రైతులు భూములు త్యాగం చెయ్యడం గొప్ప విషయం..
- పోలీసులకు కోటి రూపాయల వరకు బీమా కల్పించాం: హోంమంత్రి అనిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Minister Anita: గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలం వెలగపూడిలో కొత్త సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయాన్ని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారభించింది. ఈ కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ రోజు తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ నూతన కార్యాలయం ప్రారంభిoచడం సంతోషంగా ఉందన్నారు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. 2014లో సీఎం చంద్రబాబు అమరావతి ప్రారంభించారు.. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యాలయం పూర్తి కాకుండా ఉందని మంత్రి అనిత పేర్కొన్నారు.
Read Also: Kerala State Film Awards 2025 : 10 అవార్డులు దక్కించుకుని సంచలనం సృష్టించిన మలయాళ చిత్రం..
Also Read
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
అయితే, రాజధాని కోసం రైతులు భూములు త్యాగం చెయ్యడం గొప్ప విషయం అని వంగలపూడి అనిత తెలిపింది. అమరావతి రైతుల కష్టం.. ప్రతి ఫలమే ఇవాళ అందరూ చూస్తున్నారు.. ఈ బిల్డింగ్ పూర్తి చెయ్యడానికి ఎస్పీ వకుల్ జిందాల్, డీఎస్పీ మురళీ కృష్ణ చాలా కృషి చేశారని గుర్తు చేసింది. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు డీజీపీ కృషి చేస్తున్నారు.. పోలీసులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.. పోలీసులకు కోటి రూపాయలు వరకు భీమా కల్పించాం అని వెల్లడించింది. కల్పిత వీడియోల ద్వారా చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు.. అలాంటి వాటిని సమర్ధవంతంగా ఏపీ పోలీసులు ఎదుర్కొంటున్నారని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చింది.
ఇక, ఈ మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్ లో లారీపై రాళ్లు వేసిన వీడియో.. ఏపీలో జరిగినట్లు వైసీపీ ప్రచారం చేసిందని మంత్రి వంగలపూడి అనిత పేర్కొనింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను సమర్థవంతంగా ఏపీ పోలీసులు ఎదుర్కొన్నారు.. టెక్నాలజీ ఉపయోగించి తప్పుడు వార్తలు స్ప్రెడ్ కాకుండా చూడాలని సీఎం ఆదేశించారు.. కూటమి ప్రభుత్వం వచ్చాకే 6 వేల100 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాం.. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదు.. చనిపోయిన పోలీసు కుటుంబానికి అండగా ఉంటాం.. బీమా ద్వారా కనిష్టంగా రూ. 15 లక్షలు ఇవ్వడం జరుగుతుంది.. ఈ సబ్ డివిజన్ లో సిబ్బంది కొరత ఉంది.. త్వరలో అన్నీ భర్తీ చేస్తామని వంగలపూడి అనిత హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!