Speaker Ayyanna Patrudu: తెలుగు భాష కాదు.. మన సంస్కృతి.. జీవన విధానం… మన ఆచారం..
- ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు..
- తెలుగు భాష కాదు.. సంస్కృతి..
- మన భాష... సంస్కృతి ఇప్పటి పిల్లలకు తెలియదు..
- పిల్లలకు తెలుగు భాష గురించి చెప్పాలి..
- మన జీవన విధానం... మన ఆచారం తెలుగు..
- అమ్మ చెప్పే లాలి పాటలో తెలుగు ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Speaker Ayyanna Patrudu: తెలుగు భాష కాదు.. మన సంస్కృతి.. మన జీవన విధానం… మన ఆచారం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.. గుంటూరులో జరుగుతోన్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు భాష ప్రాధాన్యంపై భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఒక భాష మాత్రమే కాదు.. అది మన సంస్కృతి, మన జీవన విధానం, మన ఆచారం అని స్పష్టం చేశారు. అయితే, నేటి తరం పిల్లలకు తెలుగు భాషతో పాటు మన సంప్రదాయాలు, ఆచారాలు కూడా తెలియకపోవడం బాధాకరమని అయ్యన్నపాత్రుడు అన్నారు. మన భాష, మన సంస్కృతి గురించి ఈనాటి పిల్లలకు అవగాహన లేదు. అందుకే పిల్లలకు తెలుగు గొప్పదనాన్ని మనమే చెప్పాలి అని సూచించారు.
Read Also: Iran: ఇరాన్లో తీవ్రమవుతున్న నిరసనలు.. భారతీయ విద్యార్థుల్లో భయాందోళనలు
Also Read
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
- Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
- Divyang Shakti Scheme: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారికోసం మరింత ఆలోచన చేస్తాం..
తెలుగు మన జీవితంలో ఎంతగా పాతుకుపోయిందో వివరించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. అమ్మ చెప్పే లాలిపాటలో తెలుగు ఉంది. తల్లి గొంతు నుంచి వచ్చే ఆ తొలి పాటే తెలుగుతో మొదలవుతుంది. అది మన భాషలోని మాధుర్యానికి గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు.. గతంలో తల్లిదండ్రులు “చందమామ రావే, జాబిల్లి రావే” అంటూ పిల్లలకు అన్నం తినిపించేవారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు సెల్ఫోన్ చేతిలో పెట్టి పిల్లలకు అన్నం పెడుతున్నారు. ఇది మారాలి. టెక్నాలజీ అవసరమే.. కానీ సంస్కృతిని మర్చిపోవద్దు అని హితవు పలికారు.
తెలుగు భాష మన పండగల్లో, పూజల్లో, ఆచారాల్లోనూ ఉందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. దసరా, సంక్రాంతి, శ్రీరామనవమి, ఉగాది వస్తే పల్లెలు కళకళలాడేవి. ప్రతి పండగలో తెలుగు పాట, తెలుగు పలకరింపు, తెలుగు సంప్రదాయం ఉండేవి. కానీ, ఈరోజు మనం ఉగాది (తెలుగు సంవత్సరాది)ని కూడా పట్టించుకోవడం లేదు. ఇది మన సంస్కృతి పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనం అని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి లాంటి తెలుగు భాషను అందరూ గౌరవించాలి. దాన్ని చిన్నచూపు చూడకూడదు. మన జీవన విధానం, మన ఆచారం, మన సంస్కృతి.. అన్నీ తెలుగే అని మరోసారి స్పష్టం చేశారు.. ఇకపై ఇంట్లో, బడిలో, సమాజంలో పిల్లలకు తెలుగు భాష, తెలుగు సంస్కృతి గురించి చెప్పాలని పిలుపునిచ్చారు. భాషను బతికించుకుంటేనే సంస్కృతి బతుకుతుంది.. సంస్కృతి బతికితేనే మన గుర్తింపు నిలబడుతుంది అని పేర్కొన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు..
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!