Ambati Rambabu: వారి చెప్పు చేతల్లో పోలీసు వ్యవస్థ పని చేస్తున్నట్లు కనిపిస్తుంది..
- గుంటూరు నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు
- వైసీపీ నాయకులపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి
- జగన్తో పాటు వైసీపీ నేతల కుటుంబాలపై అసభ్య కామెంట్స్ చేస్తున్నారు- అంబటి రాంబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ కీలక నాయకులపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్తో పాటు వైసీపీ నేతల కుటుంబాలపై ఐ టిడిపి అనే పేరుతో అసభ్య కామెంట్స్ చేస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ విషయంలో ఈ నెల 17,18,19 తేదీలలో అనేక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశామన్నారు. ఆ ఫిర్యాదులపై ఇప్పటి వరకు కేసులు కూడా పెట్టినట్లు సమాచారం లేదని అంబటి రాంబాబు తెలిపారు.
Read Also: IPL 2025 Mock Auction: ఐపీఎల్ మాక్ వేలంలో రికార్డ్ ధరలకు అమ్ముడుబోయిన రిషబ్ పంత్, కేఎల్ రాహుల్
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
వైసీపీ సోషల్ మీడియా ఆక్టివిస్ట్లను అరెస్టు చేస్తున్నారు.. ఇప్పటికీ 100 మందిపై కేసులు పెట్టారని అంబటి రాంబాబు తెలిపారు. వైసీపీ నేతలపై టీడీపీ నాయకుల ట్విట్టర్లో సైతం దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. తాము 10 ఫిర్యాదులు చేస్తే ఒక్క కేసు నమోదు కాలేదన్నారు. కానీ వైసీపీ క్యాడర్ పై 300 కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. టీడీపీ నాయకుల చెప్పు చేతల్లో పోలీసు వ్యవస్థ పని చేస్తున్నట్లు కనిపిస్తుంది.. ఇలాగే పోలీసులు ప్రవర్తిస్తే తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు.
Read Also: Champai Soren: చంపై సోరెన్ జయకేతనం.. సెరైకెలా నుంచి గెలుపు
తప్పు ఎవరు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవాలి.. మాజీ మంత్రులు ఫిర్యాదునే పట్టించుకోక పొతే ఎలా..? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇదే విషయం పై పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేస్తాం.. తాము ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన కేసులు నమోదు చేయడం లేదన్నారు. ఐదు స్టేషన్లలో తాము ఇచ్చిన పది ఫిర్యాదులలో కేసులు నమోదు చేయాలి.. లేదంటే ఉన్నత న్యాయ స్థానాలలో ప్రైవేటు కేసులు వేస్తామని అంబటి రాంబాబు తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!