Ambati Rambabu: అంబటి రాంబాబుకు ఊరట.. ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోర్టు ఆదేశాలు..
Ambati Rambabu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టులో ఊరట లభించింది.. రూల్స్ ప్రకారం అంబటి రాంబాబుకు జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది గుంటూరు కోర్టు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో తనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపింది కోర్టు.. అయితే, ఇంటి నుంచి భోజనం, మంచం, బెడ్డు, దిండు, దోమతెర, ఎయిర్ కూలర్, అవసరమైన మందులు, మెడికల్ పర్యవేక్షణ, ప్రత్యేకమైన రూమ్ ఏర్పాటు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు అంబటి రాంబాబు.. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. అంబటి రాంబాబు మాజీ మంత్రి కాబట్టి అతనికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించింది.. అంబటి రాంబాబుని ప్రత్యేక రిమాండ్ ఖైదీగా చూడాలని అధికారులను ఆదేశించింది గుంటూరు కోర్టు..
Read Also: X (Twitter) DOWN.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు..!
Also Read
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
- Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
- Divyang Shakti Scheme: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారికోసం మరింత ఆలోచన చేస్తాం..
- Vegetable Market: మరోసారి తెరపైకి కూరగాయల హోల్ సేల్ మార్కెట్ వివాదం
మరోవైపు.. అంబటి రాంబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్తో పాటు, పోలీస్ కస్టడీ కోరుతూ దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఈ నెల 18వ తేదీకి తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసు 2023 సంక్రాంతి సంబరాల పేరుతో నిర్వహించిన లక్కీ డ్రా వ్యవహారానికి సంబంధించినది. ఈ వ్యవహారంపై గుంటూరులోని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా కోర్టులో ఇరు పక్షాల మధ్య ఆసక్తికర వాదనలు సాగాయి.. అంబటి రాంబాబు తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు. ఆయన వాదనల్లో.. తీవ్ర నేరాలు, జీవితఖైదు శిక్షలు పడే కేసుల్లోనే బెయిల్ నిరాకరించాలి.. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో రిమాండ్ అవసరం లేదని.. రెండేళ్లలోపు శిక్ష విధించే సెక్షన్లు మాత్రమే ఉన్నందున కస్టడీ అవసరం లేదని పేర్కొన్నారు.. అంబటికి బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు.. మరోవైపు, పోలీసుల తరఫు న్యాయవాది.. అంబటి రాంబాబు లాటరీ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేశారని వాదించారు. ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ కోసం పోలీస్ కస్టడీ అవసరమని కోర్టును కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, బెయిల్ మరియు పోలీస్ కస్టడీ పిటిషన్లపై తీర్పును ఈ నెల 18వ తేదీకి రిజర్వ్ చేశారు. ఈ కేసులో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
తాజావార్తలు
-
SRH Players Dance: గ్రౌండ్లో బ్యాట్తోనే కాదు.. ఫ్లోర్పై డాన్స్తో కూడా అదరగొడుతున్న SRH ఆటగాళ్లు.. వీడియో వైరల్!
-
Shivathmika: నెపోటిజంపై శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ కామెంట్స్..
-
Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
-
Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..
-
Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?