Gitam Admissions: గీతం అడ్మిషన్స్ కౌన్సిలింగ్ షురూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూన్ 1 నుంచి గీతం అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రారంభం విలేఖరుల సమావేశంలో వెల్లడించిన గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తొలి దశ ఆన్లైన్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 1 , 2022 నుంచి ప్రారంభం కానుందని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మంగళవారం హైదరాబాద్ లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.
అఖిల భారత గీతం ప్రవేశ పరీక్ష (గాట్ -2022 )ని దేశవ్యాప్తంగా 83 కేంద్రాలలో మే 20-26న నిర్వహించగా, 25 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారని, 27 వ తేదీన ఫలితాలను వెల్లడించినట్టు తెలిపారు. కౌన్సెలింగ్ లో పాల్గొనాలని అభిలషించే విద్యార్థులు admissions.gitam.edu కు లాగిన్ అవ్వాలని , అక్కడ ప్రవేశ పరీక్ష ఫలితాలతో పాటు స్కాలర్షిప్ వివరాలను కూడా పొందుపరచామన్నారు.
Also Read
గీతం ప్రవేశ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్ , ఆర్కిటెక్చర్ , సెన్స్ , ఫార్మసీ , మేనేజ్మెంట్ , లా , హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెనెస్ , పబ్లిక్ పాలసీ , నర్సింగ్ , ఫిజియోథెరపీ , పారామెడికల్ కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తున్నట్టు ప్రొఫెసర్ రావు వివరించారు. గీతం ప్రవేశ పరీక్షలో వచ్చిన స్కోరు లేదా ర్యాంకు ఆధారంగా మెరిట్ స్కాలర్ షిప్ ఇస్తున్నానని , అత్యుత్తమ ప్రతిభా వంతులకు ప్రవేశ రుసుములో పూర్తి రాయితీ ఉంటుందని ఆ తరువాత ర్యాంకులను బట్టి 75 శాతం , 50 , 25 , 15 శాతం రాయితీలను ఇచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు . బీటెక్ లో ప్రవేశం పొందగోరే ఔత్సాహికులకు 2022 లో నిర్వహించే జేఈఈ మెయిన్ , టీఎస్ ఎంసెట్ , ఏపీ ఈఏపీసెట్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా కూడా మొదట వచ్చిన వారికి తొలి ప్రాధాన్యం పద్ధతిపై స్కాలర్ షిప్ లు మంజూరు చేస్తున్నట్టు తెలియజేశారు.
గాట్ -2022 ఫేజ్ -1 లో మొత్తం మూడువేలమంది విద్యార్థులకు స్కాలర్ షిప్ ప్రకటించగా, అందులో 1,410 మంది తెలంగాణ రాష్ట్రం వారని ప్రొఫెసర్ డీ.ఎస్.రావు పేర్కొన్నారు. ఉపకారవేతనం శాతం గాట్ ఆధారంగా స్కాలర్ షిప్ అందిస్తామన్నారు. 2021-21 విద్యా సంవత్సరంలో నిర్వహించిన ప్రాంగణ నియామకాలలో గీతం మూడు ప్రాంగణాల నుంచి దాదాపు 3,950 మంది విద్యార్థులు ఎంపికవగా, అందులో హైదరాబాద్ ప్రాంగణం నుంచి వెయ్యి మంది ఉద్యోగాలు పొందినట్టు ప్రొఫెసర్ రావు వివరించారు.
గీతం లో అత్యుత్తను ప్రమాణాలను ఐటీ , సేవా రంగాలతో పాటు ప్రధాన పరిశ్రమలెన పలు బహుళ జాతి , దేశీయ కంపెనీలు గుర్తించాయని , ఇది ఏడాదికేడాది ఆయా కంపెనీలు మరిన్ని ప్రాంగణ నియామకాలు చేపట్టేందుకు దోహద పడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు . ఈ విలేకరుల సమావేశంలో గీతం రెసిడెంట్ డెరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ సి.ఉదయకుమార్ , హెడ్ – అడ్మిషన్స్ డాక్టర్ కె.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు .
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..