NTV Telugu Site icon

పులిచింత‌లలో భూప్ర‌కంప‌న‌లు…

గుంటూరు జిల్లాలోని పులిచింత‌ల స‌మీపంలో ఆదివారం ఉద‌యం భూప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి.  ఈరోజు ఉద‌యం 7:15 గంట‌ల నుంచి 8:20 గంట‌ల మ‌ధ్య‌లో మూడుసార్లు భూమి కంపించింది.  భూకంప‌లేఖినిపై దీని తీవ్ర‌త 2.3,2.7,3 గా నమోదయింది.  పులిచింత‌ల‌తో పాటుగా తెలంగాణలోని చింత‌ల‌పాలెం, మేళ్ల‌చెరువు మండ‌లాల్లోనూ, సూర్య‌పేట‌లోనూ స్వ‌ల్పంగా భూమి కంపించిన‌ట్టు ఎన్‌జీఆర్ఐ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  భూమిలోప‌ల పొర‌ల్లో వ‌స్తున్న మార్పుల కార‌ణంగా భూప్ర‌కంప‌న‌లు క‌లుగుతున్నాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  

Read: “పాగల్” టైటిల్ వీడియో సాంగ్ రిలీజ్