Dwarakatirumala: 2 వేలు విరాళం ఇస్తే… 8 కోట్లు ఇచ్చినట్టు లెక్కలు
ఒక్కోసారి చిన్నచిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. కొంతమంది దేవాలయాలకు చందాలు, విరాళాలు ఇస్తుంటారు. ఒక వ్యక్తి ఇచ్చిన విరాళం తక్కువే అయినా, కోట్లలో విరాళం ఇచ్చినట్టు దేవస్థానం రికార్డుల్లో నమోదైంది. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమలలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి శ్రీవారి నిత్య అన్నదానం ట్రస్టుకు. రూ. 2116 చెల్లించాడో భక్తుడు. కానీ రూ 8.కోట్లకు పైగా ఇచ్చినట్టు ఆన్ లైన్లో ఎంటర్ చేశాడో ఉద్యోగి. ఆ తప్పు సరిదిద్దుకునేందుకు ఆలయ అధికారులు నానా తిప్పలు పడుతున్నారు.
ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి నిత్య అన్నదాన ట్రస్టుకు కు ఒక భక్తుడు రూ.2,116 విరాళం చెల్లించాడు. అతడు రూ.8 కోట్లకు పైగా చెల్లించినట్లు ఉద్యోగి ఆన్లైన్లో పొరపాటున నమోదు చేశాడు. చివరకు నగదు లావాదేవీలలో కోట్లాది రూపాయల మేర తేడా రావడంతో సంబంధిత ఉద్యోగి ఆలయ అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికిచెందిన ఓ భక్తుడు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ తూర్పు రాజగోపురం ప్రాంతంలోని డొనేషన్ కౌంటర్ లో గురువారం సాయంత్రం నిత్య అన్నదానం ట్రస్టుకు రూ.2,116 విరాళంగా చెల్లించాడు. అక్కడే ఉన్న దేవస్థానం ఉద్యోగి నగదు ఎంటర్ చేయాల్సిన స్థానంలో పొరపాటున భక్తుడి నెంబర్ ఎంటర్ చేశాడు. దాంతో ఆ భక్తుడు రూ. 8 కోట్లకు పైగా విరాళం చెల్లించినట్లు ఆన్లైన్లో నమోదైంది.
Also Read
- YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
ఆ తరువాత ఉద్యోగి ఆ నగదు రసీదును భక్తుడికి అందించగా అతడు స్వగ్రామానికి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం డీసీఆర్ క్లోజ్ చేసే సమయంలో కోట్ల లో నగదు తేడా వచ్చినట్లు గుర్తించారు. క్షుణ్ణంగా పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఖంగుతిన్న ఆలయ అధికారులు ప్రస్తుతం ఆ తప్పును సరిదిద్దుకునే పనిలో పడ్డారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోట్లలో తేడా రావడంతో ఉద్యోగి చేసిన పొరపాటు అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
తాజావార్తలు
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా! ఒకేసారి మూడు క్రేజీ ప్రాజెక్టులు?
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!