Dwarakatirumala: 2 వేలు విరాళం ఇస్తే… 8 కోట్లు ఇచ్చినట్టు లెక్కలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కోసారి చిన్నచిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. కొంతమంది దేవాలయాలకు చందాలు, విరాళాలు ఇస్తుంటారు. ఒక వ్యక్తి ఇచ్చిన విరాళం తక్కువే అయినా, కోట్లలో విరాళం ఇచ్చినట్టు దేవస్థానం రికార్డుల్లో నమోదైంది. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమలలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి శ్రీవారి నిత్య అన్నదానం ట్రస్టుకు. రూ. 2116 చెల్లించాడో భక్తుడు. కానీ రూ 8.కోట్లకు పైగా ఇచ్చినట్టు ఆన్ లైన్లో ఎంటర్ చేశాడో ఉద్యోగి. ఆ తప్పు సరిదిద్దుకునేందుకు ఆలయ అధికారులు నానా తిప్పలు పడుతున్నారు.
ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి నిత్య అన్నదాన ట్రస్టుకు కు ఒక భక్తుడు రూ.2,116 విరాళం చెల్లించాడు. అతడు రూ.8 కోట్లకు పైగా చెల్లించినట్లు ఉద్యోగి ఆన్లైన్లో పొరపాటున నమోదు చేశాడు. చివరకు నగదు లావాదేవీలలో కోట్లాది రూపాయల మేర తేడా రావడంతో సంబంధిత ఉద్యోగి ఆలయ అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికిచెందిన ఓ భక్తుడు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ తూర్పు రాజగోపురం ప్రాంతంలోని డొనేషన్ కౌంటర్ లో గురువారం సాయంత్రం నిత్య అన్నదానం ట్రస్టుకు రూ.2,116 విరాళంగా చెల్లించాడు. అక్కడే ఉన్న దేవస్థానం ఉద్యోగి నగదు ఎంటర్ చేయాల్సిన స్థానంలో పొరపాటున భక్తుడి నెంబర్ ఎంటర్ చేశాడు. దాంతో ఆ భక్తుడు రూ. 8 కోట్లకు పైగా విరాళం చెల్లించినట్లు ఆన్లైన్లో నమోదైంది.
Also Read
- Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
- AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
- Heavy Rain Alert: ఏపీపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ
- YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
ఆ తరువాత ఉద్యోగి ఆ నగదు రసీదును భక్తుడికి అందించగా అతడు స్వగ్రామానికి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం డీసీఆర్ క్లోజ్ చేసే సమయంలో కోట్ల లో నగదు తేడా వచ్చినట్లు గుర్తించారు. క్షుణ్ణంగా పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఖంగుతిన్న ఆలయ అధికారులు ప్రస్తుతం ఆ తప్పును సరిదిద్దుకునే పనిలో పడ్డారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోట్లలో తేడా రావడంతో ఉద్యోగి చేసిన పొరపాటు అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
తాజావార్తలు
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!