Devineni Chandhu : దృష్టి మళ్లించేందుకు కొత్త జిల్లాల విభజన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు యువత నేత దేవినేని చందు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చాక రోజుకో సమస్య సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు.
చంద్రబాబు ఉన్నంత కాలం విద్యుత్ చార్జీ పెంచలేదని, స్లాబ్ రేట్ 1.90 పైసలు పెంచి ప్రజలపై అదనపు భారం వేశారన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచడంతో ప్రజల నుంచి వైసీపీ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఆయన మండిపడ్డారు.
ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టి మళ్లించేందుకు హడావిడిగా కొత్త జిల్లాల విభజన చేపట్టింది ప్రభుత్వమని ఆయన విమర్శించారు. 30 యూనిట్లు వాడితే చాలు ప్రజల పై విద్యుత్ భారం పడుతుందని ఆయన అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకూ ప్రజల పక్షాన ఉండి తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. చెత్త మీద కూడా పన్ను వేసింది, ఈ చెత్త ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే చెత్త, ఆస్తి పన్ను వేసి ప్రజలపై భారం మోపిన ప్రభుత్వం ఇప్పుడు విద్యుత్ ఛార్జీల పేరుతో నిరుపేదలపై భారం వేస్తుందని ఆయన అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
-
Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టాలు తప్పవు!
-
JanaNayagan : జననాయగన్ మరోసారి సెన్సార్.. అదనంగా మరో 41 సెకండ్స్
-
FIFA World Cup: ఫ్రాన్స్కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
-
AK 64 : శ్రీలీల ఆఫర్ కయాద్ లోహార్ తన్నుకు పోయిందా..?
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!