NTV Telugu Site icon

Pawan Kalyan: మంత్రులను మాయ చేసేలా అధికారుల సమాచారం.. డిప్యూటీ సీఎం పవన్ అసంతృప్తి..!

Pawan

Pawan

Pawan Kalyan: అధికారుల తీరు మీద రాష్ట్ర అసెంబ్లీ లాబీల్లో చర్చ కొనసాగింది. మంత్రులను మాయ చేసేలా సమాచారం ఇస్తున్నారని అధికారులపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వానికి సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడం లేదని మంత్రులు వాపోతున్నారు. ఇక, గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై అధికారులు ఇచ్చిన సమాచారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాల్లేకుండా అవును.. కాదు.. ఉత్పన్నం కాదనే రీతిలో అధికారులు సమాధానమివ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పొడి పొడిగానే సమాధానాలు చెప్పాలనే నిబంధన ఏమైనా ఉందా అని అధికారులను ఉప ముఖ్యమంత్రి అడిగారు.

Read Also: Getup srinu : రాజుయాదవ్ ఓటీటీ స్ట్రీమింగ్..ఎప్పుడు ఎక్కడ..?

ఇక, అనుబంధ పత్రాల్లో కాకుండా.. సభ్యులకు ఇచ్చే సమాధానంలోనే వివరాలు ఉంచేలా చూడాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు పైనా అధికారుల సమాచారంపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. గత ప్రభుత్వంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఎంత మాత్రం మళ్లించ లేదని సదరు అధికారులు సమాచారమిచ్చారు.. అధికారుల సమాచారానికి భిన్నంగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సభలో సమాధానం ఇచ్చారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు విషయంలో పూర్తి స్థాయి సమాచారం లేదని మంత్రి డోలా పేర్కొన్నారు. సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపై పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులకు మంత్రి డోలా ఆదేశాలు జారీ చేశారు.