Site icon NTV Telugu

ఏపీలో కరోనా విజృంభణ..24 గంటల్లో 14,440 కొత్త కేసులు

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. మొన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు.. ఈ మధ్య కాలంలో భారీగా పెరిగి పోతున్నాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 14,440 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,80, 634 కి పెరిగింది.ఒక్క రోజు వ్యవధిలో మరో నలుగురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 542 కి చేరింది.

Read Also: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు నేతాజీ అవార్డు ప్రదానం

ప్రస్తుతం రాష్ట్రంలో 83,610 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 3969 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 82 , 482 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 46, 650 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,21,47,031 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Exit mobile version