Site icon NTV Telugu

ఏపీలో కొత్తగా 14,502 కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మహమ్మారి కేసులు.. ఇవాళ మరోసారి కాస్త పెరిగాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లెక్కల ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 14,502 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,95, 136 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 7 గురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 549 కి చేరింది.

Read Also: ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే విద్యుత్‌ టారీఫ్‌ల పెంపుపై నిర్ణయం: సి.వి నాగర్జున రెడ్డి

ప్రస్తుతం రాష్ట్రంలో 93,305 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 4800 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 87 , 282 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 40, 266 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 32187297 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా ప్రజలు అప్రమత్తంగ ఉంటూ కరోనా నిబంధనలు పాటించాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Exit mobile version