Site icon NTV Telugu

ఏపీ రెయిన్స్‌ : తిరుపతిలో కంట్రోల్‌ రూం ఏర్పాటు

ఏపీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో తిరుపతిలో 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పాపవినాశనం, గోగర్భం, ఆకాశగంగ, కుమారధార పసుపుధార జలాశయాలు నిండుకుండాల మారాయి. దీంతో పాపవినాశనం, గోగర్భం డ్యాం గేట్లను అధికారులు ఎత్తారు. కుమారధార పసుపుధార, ఆకాశగంగ జలశయాల నుంచి ఓవర్‌ ఫ్లోలో నీటిని విడుదల చేస్తున్నారు.

ఇప్పటికే తిరుపతి బస్టాండ్‌, రైల్వే బ్రిడ్జి నీట మునగడంతో తిరుపతిలో కంట్రోల్‌ రూంను అధికారులు ఏర్పాటు చేశారు. శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. ప్రజలు ఏవైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్‌ రూంను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

Exit mobile version