కరోనా కట్టడిపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి: కోవిడ్ -19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్పై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. కోవిడ్ నివారణా చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన కాన్సన్ట్రేటర్లు, డీ టైప్ సిలెండర్లు, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు తదితర వాటి నిర్వహణకోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు ఈ సందర్భంగా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీని కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని.. పీహెచ్సీల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఉంచాలని ఆదేశించారు.
Read Also : డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీక్షకులకు ఇక పండగే పండగ!
Also Read
- Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
జిల్లాల వారీగా వీటి నిర్వహణకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలని.. ఏపీఎంఎస్ఐడీసీలో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. 100 బెడ్లు ఉన్న ఆస్పత్రుల్లో ప్రాధాన్యతగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేయించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సీఎం జగన్.. మిగిలిన ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టిపెట్టాలని తెలిపారు. ప్లాంట్ల ఏర్పాటు ద్వారా వారికి 30శాతం సబ్సిడీ ఇస్తున్నామన్న సీఎం… కొత్త మెడికల్ కాలేజీల కోసం పెండింగ్లో ఉన్న భూ సేకరణను పూర్తిచేయాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
Suvendu Adhikari: మమతా బెనర్జీని ఓడించినందుకే నా పీఏను హత్య చేశారు..
-
Tamil Nadu: జంపింగ్ భయం.. పుదుచ్చేరికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తరలింపు
-
CM Revanth Reddy : సాధారణ ట్రాఫిక్లో సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్
-
Love Marraige: ప్రేమంటే ఇదే.. మాజీ ఖైదీని పెళ్లాడిన మహిళా జైలర్..
-
Tamil Nadu: లెఫ్ట్ పార్టీల మద్దతు కోరిన విజయ్.. రేపు చెబుతామన్న వామపక్షాలు