ఏపీ సీఎం జగన్ ఒడిశా టూర్ సక్సెస్ అయిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం జగన్ ఒడిస్సా టూర్ సక్సెస్ అయిందా..? ఆ రాష్ట్ర సీఎంతో ఏపీ ముఖ్యమంత్రి జరిపిన చర్చలు సఫలమయ్యాయా..? ఎన్నో దశాబ్ధాల నుంచి పరిష్కారం కాని సమస్యలు ఓ కొలిక్కివచ్చినట్టేనా..? అసలు ఏపీ సీఎం జగన్.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ల మధ్య ఏ విషయాలు చర్చకువచ్చాయి..?
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సమావేశం సుదీర్ఘంగా సాగింది.
ఒడిషా సచివాలయంలో జరిగిన ఇరు రాష్ట్రాల సీఎంల భేటీలో ప్రధానంగా మూడు అంశాలు చర్చకు వచ్చాయి. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల సీఎస్లతో కమిటీ ఏర్పాటు చేయాలని అంగీకారానికి వచ్చారు. ముఖ్యంగా ఒడిశా అభ్యంతరాలతో అనేక దశాబ్దాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో సానుకూలంగా చర్చ జరిగింది. వంశధార నదిపై నేరేడి బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం వైఎస్ జగన్.. ఈ భేటీలో నవీన్ పట్నాయక్తో చర్చించారు.
Also Read
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
- Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
వీటితో పాటు పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల సమస్య, బహుదానది నీటి విడుదల, కోఠియా గ్రామాల గురించి మాట్లాడుకున్నారు. అంతేకాదు ఇంధన రంగంలో బలిమెల, ఎగువ సీలేరు కోసం ఎన్వోసీ, యూనివర్శిటీల్లో ఒడిషా, తెలుగు భాషాభివృద్ధికి కలిసి పనిచేయాలని నిర్ణయించారు. మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణ, గంజాయి సాగు, రవాణా నివారణపైనా సహకారం కొనసాగించడంతో పాటు కలిసికట్టుగా ఎదుర్కోవాలని రెండు రాష్ట్రాలు నిర్ణయించాయి. సరిహద్దు జిల్లాల్లో ఒడిశాలో తెలుగు, ఆంధ్రలో ఒడియాకు సంబంధించి లాంగ్వేజ్ టీచర్ల నియామకం, పాఠ్యపుస్తకాల పంపిణీ, పరీక్షల నిర్వహణకు స్నేహపూర్వక వాతావరణం పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అంతేకాదు శ్రీకాకుళంజిల్లాలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, బరంపురం యూనివర్శిటీల ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. రెండు రాష్ట్రాల విశాల ప్రయోజానాల ధ్యేయంగా సమావేశం సాగిందని సీఎం జగన్ .. ట్వీట్ చేశారు. త్వరలో ఈ చర్చలు సత్ఫలితాలు ఇస్తాయని విశ్వసిస్తున్నానన్నారు.
తాజావార్తలు
-
CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
-
Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
-
Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?
-
CJP Protest: ఏ సమయంలోనైనా చర్చలకు సిద్ధం.. సీజేపీకి కేంద్రం మరోసారి పిలుపు..
-
Trisha: విజయ్ జన నాయగన్ సినిమా చూసిన త్రిష.. రియాక్షన్ వైరల్!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!