CM Jagan Tour: రేపు సీఎం జగన్ కుప్పం పర్యటన… బాబు వస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. చంద్రబాబు ఇలాకాలో జగన్ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కుప్పంలో ఎలాగైనా పాగా వేయాలని, చంద్రబాబుని ఇంటికే పరిమితం చేయాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే కుప్పంపై జగన్ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. కుప్పం పర్యటనలో భాగంగా జగన్ వైయస్సార్ చేయూత పథకం మూడో విడత నిధులను విడుదల చేయనున్నారు. ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకుని అక్కడినుంచి బయలుదేరతారు జగన్. వాస్తవానికి గురువారం కుప్పం పర్యటనకు జగన్ వెళ్లాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల 23కి వాయిదా పడింది.
Read Also: Hyderabad Traffic: అలా చేస్తే కఠిన చర్యలే.. పోలీసులు స్పెషల్ డ్రైవ్..
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
10.45 గంటలకు కుప్పం చేరుకుంటారు. 11.15 – 12.45 గంటల మధ్య బహిరంగ సభలో పాల్గొని, వైయస్సార్ చేయూత పథకం మూడో విడత నిధులను విడుదల చేస్తారు. బహిరంగ సభ తరువాత కుప్పం నేతలతో భేటీ అవుతారు. 1.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇదిలా వుంటే సీఎం జగన్ పర్యటనకు విపక్ష నేత, కుప్పం శాసనసభ్యుడైన చంద్రబాబునాయుడు హాజరవుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. సీఎం జగన్కు ఘనస్వాగతం పలికేందుకు స్థానిక వైసీపీ నేతలు భారీగానే ఏర్పాట్లు చేశారు.
కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారన్నారు మంత్రి. చంద్రబాబు 33 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా ఉండి కనీసం మున్సిపాలిటీ చేయలేకపోయారని.. అలాంటిది కుప్పంను మున్సిపాలిటీగా, రెవెన్యూ డివిజన్గా మార్చి జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు.
కుప్పం నియోజకవర్గంలోని గోడలపై 175కు 175 సీట్లు.. ఫస్ట్ టార్గెట్ కుప్పం అంటూ హడావిడి చేస్తున్నారు. చంద్రబాబుకి ఇప్పటికే ఆహ్వానం పంపారు అధికారులు. సాధారణంగా సీఎం పాల్గొనే కార్యక్రమాలకు చంద్రబాబు హాజరయ్యే అవకాశం వుండదు. కుప్పం టూర్ లో జగన్ ఏం వరాలు ప్రకటిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also: Metro Train Dance : మెట్రో రైళ్లో డాన్స్ చేస్తూ యువతి రీల్స్.. తెగ వైరల్
తాజావార్తలు
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!