Cm Jagan Decision: పాముకాటుకి గురైన విద్యార్ధి ఫ్యామిలీకి సాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయనగరం జిల్లా కురుపాంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులంలో విద్యార్ధులు పాముకాటుకు గురైన ఘటన పై ముఖ్యమంత్రికి వివరించారు ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందడం, మరో ఇద్దరు విద్యార్ధులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు వివరించారు మంత్రులు.
విద్యార్థి మృతిపై స్పందించిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక సాయం ప్రకటించారు. మృతి చెందిన విద్యార్థి మంతిన రంజిత్ కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి. మంత్రుల ద్వారా ఈరోజు విద్యార్ధి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి. దీంతో విద్యార్ధి కుటుంబానికి ఊరట లభించనుంది. ఈఘటనపై సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Also Read
మహాత్మాగాంధీ జ్యోతీబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం రాత్రి పాముకాటుతో ఓ విద్యార్థి మృతి చెందిన సంగతి తెలిసిందే. మరో ఇద్దరు ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నారు. భోజనం అనంతరం విద్యార్థులు నిద్రిస్తున్న ఓ గదిలోకి అర్ధరాత్రి సమయంలో పాము ప్రవేశించింది. కొమరాడ మండలం దళాయిపేటకు చెందిన మంతిని రంజిత్, వంగపండు నవీన్, ఈదుబిల్లి వంశీలను కాటువేసింది. వారిని ప్రాథమిక వైద్యం అనంతరం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి విజయనగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ రంజిత్ మృతిచెందాడు. నవీన్, వంశీలకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పరామర్శించారు. రంజిత్ మరణంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..