CM Chandrababu Warning: ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్
- ఆపరేషన్ సిందూర్ పేరుతో.. పహల్గామ్ ముష్కరులను ప్రధాని మోడీ అంతం చేశారు..
- దేశానికి టెర్రరిస్టులతో చాలా నష్టం.. ఆర్థిక ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తాను..
- ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్.. అదే మీకు చివరి రోజు: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Warning: కడపలో నిర్వహించిన మహానాడు బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేశాం.. ఎస్సీలకు సామాజిక న్యాయం చేసింది.. ఇక, టీడీపీకి వెన్నెముక బీసీలు.. బీసీలకు నేను సామాజికంగా ఆర్థికంగా పెద్దపీట వేస్తాను అన్నారు. రూ. 47,756 కోట్లు కేటాయించాం.. ఎస్సీ, ఎస్టీలకు రుక్టాప్ సోలార్ ఏర్పాటుకు ఉచితంగా డబ్బులు ఇస్తాం.. బీసీలకు మూడు కిలోవాట్ల వరకు 98,000 సబ్సిడీ ఇస్తాం అని హామీ ఇచ్చారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మారపణ దినోత్సవాన్ని అధికారికంగా చేపడతాం అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసింది టీడీపీ.. కూటమి ప్రభుత్వం రాకుండా ఉండి ఉంటే మీ భూములు గోవిందా అయ్యేవి.. ఇక, రాబోయే మహానాడు నాటికి భూ సమస్యలు లేకుండా చూస్తానని చంద్రబాబు అన్నారు
Read Also: Mamata Banerjee: ప్రధాని మోడీ విమర్శలపై మమత సవాల్.. టీవీ డిబేట్కు రావాలని పిలుపు
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
ఇక, టెర్రరిస్టులు సమాజానికి ప్రమాదకరం.. ఆపరేషన్ సింధూర్ పేరుతో 10 నిమిషాల్లో టెర్రరిస్టుల స్థావరాలను మన సైన్యం ధ్వంసం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మనదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆర్థిక ఉగ్రవాదులతో నష్టం జరుగుతుంది.. ఆర్థిక ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసే బాధ్యత నాది అన్నారు. రాజకీయ ముసుగులో ల్యాండ్, శాండ్, మైన్ దోచేశారు.. జే బ్రాండ్ తో నాసిరకం మద్యం అమ్మకాలు జరిపారు.. అలాగే, డ్రగ్స్, గంజాయితో యువత నిర్వీర్యమైపోయింది.. ఎవరైనా సరే గంజాయి, డ్రగ్స్ అమ్మితే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. మా ఆడబిడ్డల జోలికి వస్తే ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి అన్నారు. ఇక, పోలవరం రాష్ట్రానికే ఒక వరం.. కేంద్రానికి చెప్పి పోలవరాన్ని ఒక గాడిన పెట్టాం.. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం.. గత పాలనలో మూడు ముక్కలు ఆట ఆడి రాజధాని లేకుండా చేశారు అని సీఎం చంద్రబాబు ఆరోపించారు.
తాజావార్తలు
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!