CM Chandrababu Warning: ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్
- ఆపరేషన్ సిందూర్ పేరుతో.. పహల్గామ్ ముష్కరులను ప్రధాని మోడీ అంతం చేశారు..
- దేశానికి టెర్రరిస్టులతో చాలా నష్టం.. ఆర్థిక ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తాను..
- ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్.. అదే మీకు చివరి రోజు: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Warning: కడపలో నిర్వహించిన మహానాడు బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేశాం.. ఎస్సీలకు సామాజిక న్యాయం చేసింది.. ఇక, టీడీపీకి వెన్నెముక బీసీలు.. బీసీలకు నేను సామాజికంగా ఆర్థికంగా పెద్దపీట వేస్తాను అన్నారు. రూ. 47,756 కోట్లు కేటాయించాం.. ఎస్సీ, ఎస్టీలకు రుక్టాప్ సోలార్ ఏర్పాటుకు ఉచితంగా డబ్బులు ఇస్తాం.. బీసీలకు మూడు కిలోవాట్ల వరకు 98,000 సబ్సిడీ ఇస్తాం అని హామీ ఇచ్చారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మారపణ దినోత్సవాన్ని అధికారికంగా చేపడతాం అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసింది టీడీపీ.. కూటమి ప్రభుత్వం రాకుండా ఉండి ఉంటే మీ భూములు గోవిందా అయ్యేవి.. ఇక, రాబోయే మహానాడు నాటికి భూ సమస్యలు లేకుండా చూస్తానని చంద్రబాబు అన్నారు
Read Also: Mamata Banerjee: ప్రధాని మోడీ విమర్శలపై మమత సవాల్.. టీవీ డిబేట్కు రావాలని పిలుపు
Also Read
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
- OTR: టీడీపీ ఎమ్మెల్యేలకు మరో దఫా కౌన్సెలింగ్..?
ఇక, టెర్రరిస్టులు సమాజానికి ప్రమాదకరం.. ఆపరేషన్ సింధూర్ పేరుతో 10 నిమిషాల్లో టెర్రరిస్టుల స్థావరాలను మన సైన్యం ధ్వంసం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మనదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆర్థిక ఉగ్రవాదులతో నష్టం జరుగుతుంది.. ఆర్థిక ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసే బాధ్యత నాది అన్నారు. రాజకీయ ముసుగులో ల్యాండ్, శాండ్, మైన్ దోచేశారు.. జే బ్రాండ్ తో నాసిరకం మద్యం అమ్మకాలు జరిపారు.. అలాగే, డ్రగ్స్, గంజాయితో యువత నిర్వీర్యమైపోయింది.. ఎవరైనా సరే గంజాయి, డ్రగ్స్ అమ్మితే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. మా ఆడబిడ్డల జోలికి వస్తే ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి అన్నారు. ఇక, పోలవరం రాష్ట్రానికే ఒక వరం.. కేంద్రానికి చెప్పి పోలవరాన్ని ఒక గాడిన పెట్టాం.. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం.. గత పాలనలో మూడు ముక్కలు ఆట ఆడి రాజధాని లేకుండా చేశారు అని సీఎం చంద్రబాబు ఆరోపించారు.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!