YS Jagan: సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా తిరుపతి లడ్డుపై రాజకీయం చేస్తున్నారు..
- సీఎం చంద్రబాబు వ్యవహార శైలిపై మండిపడిన వైసీపీ అధినేత జగన్..
- సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా తిరుపతి లడ్డుపై రాజకీయం చేస్తున్నారు..
- చంద్రబాబు అబద్ధం మీద అబద్దాలను చెప్పుకుంటూ పోతున్నారు: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: సీఎం చంద్రబాబు వ్యవహార శైలిపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా చంద్రబాబులో ఏ మార్పు రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూ ప్రసాదంపై రాజకీయాలు చేస్తున్నారంటూ ఎక్స్ ట్వీట్టర్) వేదికగా ఆయన స్పందించారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తూ తీర్పు ఇచ్చిన కూడా.. ఆ తీర్పును వక్రీకరిస్తారా? అని ప్రశ్నించారు. తప్పులను సుప్రీంకోర్టు ఎత్తి చూపుతూ మిమ్మల్ని నిలదీస్తే మాకు అక్షింతలు వేసిందని అసత్య ప్రచారం చేస్తు్నారని ఆయన సీరియస్ అయ్యారు.
Read Also: Pakistan: “ఇమ్రాన్ ఖాన్ మద్దతు నిరసనల్లో పాల్గొనండి”.. జైశంకర్కి పాకిస్తాన్ నేత ఆహ్వానం..
Also Read
ఇక, శుక్రవారం ‘ట్విట్టర్’లో టీడీపీ పార్టీ అధికారిక ఖాతాలో చేసిన పోస్ట్ లో తిరుపతి లడ్డూలో జంవుతుల కొవ్వు కలిసిందని చెప్పారని మాజీ సీఎం జగన్ తెలిపారు. తప్పు జరిగిందని తెలిసినా, దేవుడి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించినా చంద్రబాబులో కనీస పశ్చాత్తాపం కనిపించడం లేదని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అబద్ధం మీద అబద్దాలను చెప్పుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. ఇక, మనిషి అన్నాక కొద్దిగానైనా దేవుడంటే భయం, భక్తి ఉండాలని అన్నారు. ఇంత దారుణంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని వక్రీకరణ చేయడం దారుణమని చెప్పుకొచ్చారు. గౌరవనీయులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు @ncbnపై తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ.. లడ్డూ ప్రసాదం విషయాన్ని టీడీపీ ఇంకా రాజకీయం చేస్తూనే ఉందంటూ వైఎస్ జగన్ తీవ్రంగా ఆరోపించారు.
గౌరవనీయులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు @ncbn పై తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ, లడ్డూ ప్రసాదం విషయాన్ని టీడీపీ ఇంకా రాజకీయం చేస్తూనే ఉంది. pic.twitter.com/RozJAB94aD
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 5, 2024
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..